తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలిచే స్థానాల్లో ఎన్నికలను నిలిపివేయాలని కుట్రలకు తెరతీస్తుందని కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మరీ ముఖ్యంగా కొడంగల్ ఎన్నిక వాయిదా వేసేందుకు చూస్తున్నారని హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం తనను చంపాలని చూస్తోందని ఆయన అరోపించారు. తెలంగాణను కేసీఆర్ ఖూనీ చేశారని మండిపడ్డారు.
కొడంగల్ లో టీఆర్ఎస్ నేత ఇంట్లో రూ. 17.51 కోట్లు దొరికాయని ఆరోపించిన రేవంత్ రెడ్డి... ఈ విషయం బయటకు రాకుండా ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల అధికారులు, ఐటీపై ఒత్తిడి తీసుకొచ్చారని మండిపడ్డారు. కొన్ని నెలల నుంచి కొడంగల్లోని ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేసేందుకు టీఆర్ఎస్ రూ. 50 కోట్లు ఖర్చు చేసిందని... ఇందుకు సంబంధించిన డైరీ కూడా ఐటీ అధికారులకు దొరికిందని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే కేవలం రూ. 51 లక్షలు మాత్రమే దొరికాయని ఎన్నికల అధికారులు లీకులు ఇచ్చారని ఆరోపించారు.
ఇందుకు సంబంధించిన రహస్య నివేదికను తొక్కిపెట్టారని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అన్ని రకాలుగా ఉల్లంఘించారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తమిళనాడులో డబ్బుల పంపిణీ జరిగిందని ఎన్నికల సంఘంతో నివేదిక తెప్పించుకుని గత ఏడాది ఆర్కే నగర్ ఎన్నికను వాయిదా వేశారని... తెలంగాణలోనూ అదే రకంగా కొడంగల్ ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా... తన విజయాన్ని ఆపలేరని రేవంత్ రెడ్డి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more