నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నానే వ్యక్తి బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి.. ప్రధాని నరేంద్రమోడీకి ప్రైవేటు మౌత్ పీస్ అన్న విమర్శలు కూడా వచ్చినా.. ఆయన వాటిని పట్టించుకోకుండా అటు సొంతపార్టీ మంత్రులు, నేతలపై విమర్శలు చేయడంతో పాటు ఇటు ప్రతిపక్ష నేతలపై కూడా విమర్శలు గుప్పిస్తూనే వున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అసలు అర్థిక శాస్త్రం గురించి అసలు అవగాహనే లేదు అన్ని ఖారాఖండిగా చెప్పి బీజేపి పార్టీలో సెల్ప్ గోల్ చేసుకునేలా చేశారు.
నోట్ల రద్దు, నల్లధనం విషయంలో ఆయన తగు జాగ్రత్త చర్యలు తీసుకుని వుంటే.. అర్థిక పరిస్థితి చాలా బాగుండేదని నోట్ల రద్దు వ్యవహారం, నల్లధనం, జీఎస్టీ, ఆధార్ సహా పలు అంశాల్లో జరిగిపోయిన తప్పిదాలను అర్థికమంత్రిపై వేసేందుకు యత్నించారు. నోట్ల రద్దు వ్యవహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తాను స్వయంగా లిఖితపూర్వకంగా ప్రధాని నరేంద్రమోడీకి అందిస్తే.. ఆయన దానిని అర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అందజేశారని, అయితే నల్లధనంపై యాభైశాతం పన్ను విధించడంతో నల్లధనం కలిగిన వ్యక్తులు దానిని ప్రభుత్వానికి అందించేందుకు కూడా ముందుకు రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన మహిళా వాణిజ్యవేత్త(ఫిక్కీ)ల గ్రూప్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మాట్లాడుతూ కూడా సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా వాణిజ్యవేత్త సమాఖ్యలోని (ఫిక్కీ) సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ఆయన.. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం జైలుకు వెళ్తారని పేర్కొన్నారు.
ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, జయలలిత వంటి మహిళా నేతలతో మీకు శత్రుత్వం ఎందుకన్న ప్రశ్నకు స్వామి బదులిస్తూ సమాధానాన్ని దాటవేత ధోరణిలో బదులిచ్చారు. వారితో ఎందుకు వైరం అన్న సమాధానాన్ని ఇవ్వని స్వామి.. మాయావతి, మమతా బెనర్జీ తనకు మంచి స్నేహితులని పేర్కొన్నారు. ఇక అంతటితో ఆగని స్వామి.. రాజీవ్ గాంధీ లాంటి వ్యక్తి సోనియాను పెళ్లాడి తప్పుచేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిజానికి రాజీవ్ చనిపోయే నాటికి ఆ దంపతుల మధ్య అంత సామరస్యపూరిత వాతావరణం లేదన్నారు. సోనియాగాంధీ ప్రధాని కాకుండా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 90 శాతం అడ్డుకున్నారని, తానో పది శాతం కృషి చేశానని అన్నారు. ఆ విషయం తెలిసే కలాం రెండోసారి రాష్ట్రపతి కాకుండా సోనియా అడ్డుకున్నారన్నారు. బీజేపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సమాధానాలపై సమావేశానంతంరం ఫిక్కీ సభ్యులు ఆయన చేసిన వ్యాఖ్యలపై గుసగులాడుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more