పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పార్టీ ఏర్పాటు నుంచి అన్ని వేళలా వెన్నంటే వుంటూ వచ్చిన తనపై టీఆర్ఎస్ అధిష్టానం వేటు వేయడాన్ని జీర్ణంచుకోలేని ఎమ్మెల్సీ రాములు నాయక్ టీఆర్ఎస్ పార్టీతో పాటు కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆది నుంచి పార్టీ వెన్నంటి ఉండి.. కష్ట కాలంలోనూ టీఆర్ఎస్ తోడుగా వున్న తనపై అనవసరపు అబంఢాలు వేసి.. పార్టీ నుంచి తప్పించేందుకు రంగం సిద్దం చేయడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అంతం ఖాయమని తాజాగా ఆయన వెల్లడించారు. నారాయణఖేడ నుంచి తాను ఇండిపెండెంట్గా బరిలో దిగుతానని, దమ్ముంటే భూపాల్ రెడ్డి కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఇద్దరిలో ఎవరికి ప్రజల అమోదం లభిస్తుందో చూద్దామని సవాల్ విసిరారు. నారాయణఖేడ్ లో తాను ఓడిపోతే ఉరేసుకుంటానని రాములు నాయక్ వ్యాఖ్యానించడం గమనార్హం. రేపటి నుంచి తనపై భౌతిక దాడులు చేయిస్తారని.. తనకేం జరిగినా టీఆర్ఎస్దే బాధ్యత అని చెప్పారు.
గోల్కొండ హోటల్లో తాను కాంగ్రెస్ నేతలను కలిసానని.. అదే తనను సస్పెండ్ చేయఢానికి కారణమని కూడా చెబుతున్న టీఆర్ఎస్ అరోపణలపై ఆయన విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ అరోపణల్లో నిజముందని వారు బావిస్తే.. తాము చెబుతోంది నిజమైతే నార్కో అనాలిసిస్ టెస్టుకు సిద్దమా? అని నాయక్ ప్రశ్నించారు. ఎవరు ఎవరితో కలిశారో దానితో తేలిపోతుందన్నారు. తెరముందు చెబుతున్న అబద్దాలకు.. తెర వెనుక సాగుతున్న పరిణామాలకు నార్కో అనాలసిస్ పరీక్షలే లింకులను బయటపెడతాయని అన్నారు.
ఓ గిరిజన నాయకుడినైన తనను పట్టుకుని సీఎం 'కిక్ ఆఫ్' అనడం.. మొత్తం దళిత, బీసీ, గిరిజన సమాజాన్ని అవమానించడమేనని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక గోండులు-లంబాడాలు, యాదవులు-కురుములకు మధ్యన చిచ్చు పెట్టారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ 105సీట్లు కాదు కదా.. 25-30సీట్లకు మించి గెలవలేదని అన్నారు. కొత్త వాగ్దానాలతో కేసీఆర్ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారని విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more