హైదరాబాద్ లోని కొందరు కాంగ్రెస్ రాజకీయ నాయకులను టార్గెట్ గా చేసుకుని వారి ఇళ్లపై జరిగిన ఐటీ దాడులు, ఇప్పుడు నవ్యాంధ్రకూ విస్తరించాయి. నెల్లూరు టీడీపీ నేత బీద మస్తాన్ రావు ఇంట్లో సోదాలు జరిపిన ఐటీ అధికారులు, నేటి తమ తొలి టార్గెట్ గా రాష్ట్ర మంత్రి నారాయణను ఎంచుకున్నారు. ఈ వార్త తెలుసుకున్న మీడియా ఐటీ అధికారులు బస చేసిన హోటళ్ల ఎదుట మాకాం వేసి వారి వెంటే ఫాలో కావడంతో.. గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికారులు ప్లాన్ బి ని అమలుపర్చారు.
ఇప్పటికే పలు నారాయణ కాలేజీలకు చేరుకున్న ఐటీ అధికారులు, భారీఎత్తున పోలీసు భద్రత మధ్య సోదాలను ప్రారంభించారు. మీడియా అంతా చిత్రీకరిస్తున్న కారణంగా వారిని హెచ్చరించిన అధికారులు తమను వెంబడించవద్దని కూడా చెప్పారు. ఇక చివరగా పోలీసులను అడ్డుగా పెట్టుకుని వెనుదిరిగే ప్రయత్నంలో రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలను టార్గెట్ చేసుకున్నారు. వాటిలో విజయవాడ పరిధిలోని సదరన్ డెవలపర్స్ కార్యాలయం ఒకటి. ఈ సంస్థలో సోదాల సందర్భంగా అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
వివిధ ప్రాంతాల్లోని కార్యాలయాల్లో రైడ్స్ జరుగుతూ ఉండగా, సదరన్ కార్యాలయం నుంచి ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ మంత్రికి సంబంధించిన లావాదేవీల డాక్యుమెంట్లను అధికారులు కనిపెట్టి, వాటిని తమ అధీనంలోకి తీసుకున్నారని సమాచారం. సదరు మంత్రి ఇటీవలి కాలంలో పలు ప్రాంతాల్లో భూముల లావాదేవీలను జరుపగా, వాటన్నింటిపైనా ముందు నుంచే నిఘా పెట్టిన ఐటీ అధికారులు, ఈ సోదాల్లో వాటిని గుర్తించారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఐటీ అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more