నరేంద్రమోదీకి వీరాభిమాని, అందుకు తోడు అచ్చంగా ఆయనలా పోలి ఉండే ముఖవచ్చసు దీంతో ఆయన కూడా ప్రధాన మంత్రిలానే పలు నియోజకవర్గాలు పర్యటించి బీజేపి తరపున ప్రచారం చేసి కాషాయ పార్టీ విజయానికి దోహదపడ్డాడు.. అభినందన్ పాఠక్. అలాంటి పాఠక్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. అయితే ఈ సారి ఆయన గతానికి బిన్నంగా వార్తల్లో వ్యక్తిగా మారిం తన ప్రధాని స్వామి భక్తికి, బీజేపీకి షాకిచ్చారు. గత ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేసిన ఆయన ఇప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నిర్ణయించాడమే ఇందుకు కారణం.
ఉత్తరప్రదేశ్లోని షహరాన్ పూర్ కు చెందిన ఆయన ఈ ఏడాది మార్చిలో జరిగిన గోరఖ్ పూర్ ఉప ఎన్నికల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. అయినా అక్కడ మాత్రం ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి గెలుపు సాధించాడు. తాను ఇంతగా ప్రచారం చేసినా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఎలా గెలుపొందాడన్న విషయాన్ని సంహావలోకనం చేసుకున్న ఆయన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కోనసాగిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్ర మనస్తాపం చెంది కాంగ్రెస్ లో చేరి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నట్టు చెప్పారు.
ప్రధాని నరేంద్రమోదీకి వీరభక్తుడిగా కొనసాగిన తాను ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, అయితే ఆయన ప్రస్తుత పాలన తాను ఊహించనదానికి తద్భిన్నంగా వుందని.. దేశంలోని ప్రజలు ఎవ్వరూ ఆయన పాలనపై సంతృప్తిగా లేరని పాఠక్ ఆవేదన వ్యక్తం చేశారు. తానెక్కడికి వెళ్లినా ‘అచ్చే దిన్ కబ్ ఆయేంగే’ (మంచి రోజులు ఎప్పుడొస్తాయ్) అని ప్రజలు తనను నిలదీస్తున్నారని, తాను బీజేపికి మద్దతు తెలపడమే తన పాలిట శాఫంగా మారిందని.. ప్రజల నిలదీతలు, అవమానాలు, చిత్కారాలను కూడా చవిచూడాల్సి వస్తుందని పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేసి చాలా పెద్ద పొరపాటు చేశానని, ఈసారి మాత్రం ఆ తప్పు చేయబోనని, బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారం చేస్తానని తేల్చి చెప్పారు. తాను ఇప్పటికే ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్బబ్బర్ను కలిశానని, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో సమావేశం ఏర్పాటు చేస్తానని ఆయన మాటిచ్చారని పాఠక్ చెప్పారు. ఇప్పుడు తాను కాంగ్రెస్ తో పనిచేయాలని నిర్ణయించుకున్నానన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more