మీకు భారతీయ స్టేట్ బ్యాంకు (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఎస్బీఐ కస్టమర్లా.. మీకు ఎస్బీఐలో అకౌంట్ ఉందా. ఐతే.. ఈ వార్త మీకోసమే. మీరు వెంటనే వెళ్లి మీ పాత ఏటీయం కార్డులను బ్యాంకులో సమర్పించి వాటి స్థానంలో కొత్తగా వచ్చిన ఏటీయం డెబిట్ కార్డులను తీసుకోవాల్సిందే. తాజాగా అర్బీఐ జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా ఎస్బీఐ తమ కస్టమర్లకు కొత్త ఏటీయం డెబిట్ కార్డులను అందజేస్తుంది.
అయితే పాత కార్డులు (మాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులు) ఈ ఏడాది డిసెంబరు 31 నుంచి పనిచేయబోవని బ్యాంకు అధికారులు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. వాటి స్థానంలో తమ కస్టమర్లు చిప్ కార్డులు మార్చుకోవాలని బ్యాంక్ అధికారులు సూచించారు. మాగ్నటిక్ స్ట్రిప్ కార్డ్ కు బదులుగా… ఈఎంవీ(యూరో పే మాస్టర్కార్డు వీసా) చిప్ కార్డులను తీసుకోవాలని కోరుతోంది. ఇప్పటికే చాలా కార్పొరేట్ బ్యాంకులు చిప్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి.
ఈ చిఫ్ అనుసంధాన యూరో పే మాస్టర్ కార్డు వీసా ఏటీయం కార్డులతో ఆన్ లైన్ బ్యాంకు లావాదేవీలు సులువుగా జరపుకోవడంతో పాటు… మోసపూరిత లావాదేవీల నుంచి ఖాతాదారుల డబ్బులకు భద్రత కల్పించేందుకు.. ఈ చిప్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయి. వినియోగదారులకు మరింత సెక్యూరిటీ ఇస్తూ.. చిప్ కార్డులు జారీచేయాలని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఈ మార్గదర్శకాలను తాజాగా ఎస్బీఐ అమలుపరుస్తోంది.
సైబర్ నేరగాళ్లు స్కిమ్మింగ్ లాంటి నేరాలు చేయకుండా చిప్ కార్డ్ అడ్డుకుంటుంది. కార్డును ఎవరైనా దొంగతనం చేసినా… వెంటనే బ్లాక్ చేయడానికి, బ్యాంక్ సిబ్బంది వెంటనే కార్డును యాక్సెస్ చేయడానికి వీలవుతుంది. అందుకే… తమ ఖాతాదారులకు బ్యాంక్ విన్నపం చేస్తోంది. మాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులు.. అంటే ప్రస్తుతం చాలామంది దగ్గరున్న డెబిట్ కార్డుల స్థానంలో EMV చిప్ డెబిట్ కార్డును డిసెంబరు 31, 2018లోగా మార్చుకోవాలని విజ్ఞప్తిచేస్తోంది.
కొత్త కార్డ్ పొందేందుకు ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని బ్యాంక్ తెలిపింది. అకౌంట్ హోల్డర్లకు చిప్ కార్డును ఫ్రీగా ఇస్తున్నారు. కార్డు మార్చుకోవాల్సినవారు.. బ్యాంక్ ఖాతాలో సంప్రదించాల్సి ఉంటుంది. కార్డుకు, అందులో ఉన్న డబ్బుకు రక్షణ పెరుగుతుందని… ఖాతాదారులకు, బ్యాంకులకు టెన్షన్ తగ్గుతుందని బ్యాంక్ చెబుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more