భాగ్యనగర చరిత్రలో మాయని మచ్చగా మారిన జంట బాంబు పేలుళ్ల కేసులో తుది తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది. లుంబినీపార్కు, గోకుల్ ఛాట్ జంట బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించిన కేసును విచారిస్తున్న ఎన్ఐఏ న్యాయస్థానం తుదితీర్పును వచ్చే నెల 4కు వాయిదా వేసింది. 2007, ఆగస్టు 25న ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ సభ్యులు ఈ రెండు ప్రాంతాలలో బాంబులు అమర్చి విధ్వంసం సృష్టించిన సంగతి విదితమే. ఈ దుర్ఘటనలో 42మంది మృతి చెందగా... 50 మందికిపైగా గాయపడ్డారు.
జంట పేలుళ్లకు సంబంధించిన నిందితులను ఘటన జరిగిన రెండేళ్లకు అరెస్టు చేసిన పోలీసులు.. ఈ కేసును అక్టోపస్ కు అప్పగించారు. రంగంలోకి దిగిన అక్టోపస్ ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల సేకరణ, బాధితుల వాంగ్మూలం, అభియోగ పత్రాల నమోదు బాధ్యతను చేప్టటారు. ఈ దుశ్చర్యకు పాల్పడ్డ నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు. అనంతరం ఈ కేసును కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థ (నేషనల్ ఇన్వెటిగేషన్ ఏజెన్సీ) ఎన్ఐఏకు అప్పగించింది.
దీంతో నాంపల్లిలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉగ్రవాదులను విచారణ చేపట్టారు. ఇవాళ కూడా తుది విచారణ జరిపిన తరువాత న్యాయస్థానం తీర్పును వచ్చె నెల 4కు వాయిదా వేసింది. పేలుళ్ల కేసులో అనిక్ షఫిక్, ఇస్మాయిల్ చౌదరి, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, మహ్మద్ తారీక్, షప్రుద్దీన్, మహ్మద్ షేక్, అమీర్ రిజాఖాన్లను నిందితులుగా కోర్టు తేల్చింది. కాగా ఇందులో ముగ్గురు పరారీలో ఉండగా ఐదుగురిపై విచారణ కొనసాగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more