ఐదేళ్లు పాలించే అవకాశం ఇస్తే.. మళ్లీ మళ్లీ మీరే కావాలి, మీరే రావాలి అన్నట్లుగా రాష్ట్ర రూపురేఖల్ని మారుస్తానని జనసేన పార్టీ అధినేత, సినీనటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. విజయనగరం జిల్లాలోని ఎస్ కోటలో తన మలి విడత ఉత్తరాంధ్ర పోరాట యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కేవలం ఒక ప్రాంతం అభివృద్దికే పరిమితం అయ్యిందని, దానిని ప్రశ్నిస్తే తాను ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగోడుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడం విడ్డూరంగా వుందని విమర్శించారు.
ఉత్తరాంధ్ర ప్రాంతంలో గడిచిన 35 ఏళ్లలో 30 ఏళ్లు టీడీపీ పాలనే కొనసాగిందని, అయినా ఈ ప్రాంత అభివృద్దిలో మాత్రం మార్పులు కానరాడం లేదని పవన్ కల్యాన్ దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుందని అయినా వారికి సరైనా ఉద్యోగాలు లేవని, అన్నింటిలో ఔట్ సోర్సింగ్ విధానాన్ని అమలుచేసి.. భద్రత లేని భవిష్యత్తులో యువత చాలీచాలని జీతాలతో కొట్టుమిట్టాడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని యువత ఓట్లను కొట్టగొట్టిన చంద్రబాబు.. తన కొడుక్కి ఉద్యోగం ఇప్పించుకున్నాడే తప్ప.. ఉత్తరాంధ్ర నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలేదని మండిపడ్డారు.
తాత్కాలిక ప్రాజెక్టు పట్టీసీమ నిర్మాణానికి ప్రభుత్వం వద్ద నిధులు పుష్కలంగా వుంటాయి. అదే ఉత్తరాంధ్రలో భగత్ సింగ్ కాలువ నిర్మాణాకి మాత్రం నిధులు లేవు. పట్టిసీమను యుద్ద ప్రాతిపదికన మూడేళ్లలో నిర్మించి జాతికి అంకితం చేసి.. నదుల అనుసంధానమని చెప్పే ముఖ్యమంత్రి.. ఉత్తరాంధ్ర అభివృద్దిని ఎందుకు నిర్లక్ష్యం చేశారని, ఏళ్లు గడుస్తున్నా ఇక్కడ ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఎందుకు మారిందని ప్రశ్నించారు, తమ సభలకు యువత పెద్ద సంఖ్యలో రావడం చూసి ప్రభుత్వం వారికి దిగిపోయే ముందు భృతి కల్పిస్తామని చెబుతుందని, అయితే నిరుద్యోగ యువత మాత్రం భృతి వద్దు.. ఉద్యోగమే ముద్దు అంటున్నారని జనసేనాని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more