బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్, ఆయన భార్య యోగితా బాలిపై చీటింగ్, అత్యాచారం కేసు నమోదు చేయాల్సిందిగా న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. తనపై పెళ్లి పేరుతో మోసం చేయడంతో పాటు పలుమార్లు మహాక్షయ్ అత్యాచారానికి పాల్పడ్డాడని అరోపించిన యువతి న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసింది. దీంతో బాధిత యువతి పిటీషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం మహాక్షయ్ సహా అతడి తల్లిపై ఛీటింగ్, అత్యాచార కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ఢిల్లీలోని రోహిణి కోర్టు పోలీసులను ఆదేశించింది.
తనను మోసం చేసిన మహాక్షయ్ తనపై అత్యాచారం చేశాడని, ఈ క్రమంలో గర్బం దాల్చిన తనకు అబార్షన్ చేయించాడని ఆ తరువాత తప్పించుకు తిరుగుతున్నాడని దీంతోనే తాను న్యాయస్థానాన్ని అశ్రయించి న్యాయం కోసం అడుగుతున్నానని చెప్పారు. బాధిత యువతి కోర్టుకు సమర్పించిన పిటిషన్ ప్రకారం.. మూడేళ్ల నుంచి బాధిత యువతితో మహాక్షయ్కు సంబంధం ఉంది. ఇద్దరూ నిత్యం ఫోన్, చాటింగ్ ద్వారా మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఓసారి మహాక్షయ్ తన ఫ్లాట్కు రావాల్సిందిగా యువతిని కోరాడు. వెళ్లిన ఆమెకు బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి పేరుతో పలుమార్లు ఆమెను బలవంతం చేశాడు.
ఈ క్రమంలో గర్భవతి అయిన యువతికి గర్భనిరోధక మందులు ఇవ్వడంతో అబార్షన్ అయింది. ఆ తరువాత ఎన్నిసార్లు పెళ్లి పేరెత్తినా.. తప్పించుకుని తిరుగతున్నాడని అరోపించారు. ఇక మహాక్షయ్ తల్లి యోగితా బాలిని ఈ కేసులోకి లాగడంపై యువతి స్పందిస్తూ.. యోగిత తనకు ఫోన్ చేసి పలుమార్లు బెదిరించారని, తన కోడలు కావాలన్న ఆశలు ఏవైనా ఉంటే తుంచేసుకోవాలని బెదిరించారని యువతి ఆరోపించింది. పెళ్లి పేరుతో తనను మోసం చేసి అత్యాచారానికి పాల్పడినందుకే కోర్టుకెక్కినట్టు యువతి పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more