ఓ వైపు ఎయిర్ టెల్ సంస్థ ఇటు బ్రాండ్ బ్యాండ్ రంగంలోనూ దూసుకుపోతున్న క్రమంలో ఇక త్వరలోనే రిలయన్స్ జియో కూడా బ్రాండ్ బ్యాండ్ లోకి అడుగుపెడుతుందన్న సమాచారంతో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందాన.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను తనవైపుకు తిప్పుకునే చర్యలకు పూనుకుంది. అత్యంత ఆకర్షణీయమైన పథకాలను అవిష్కరించి.. బ్రాండ్ బ్యాండ్ కస్లమర్లను తమ ఖాతాలోకి వేసుకునేందుకు సిద్దమైంది. చౌకగా 20 ఎంబిపీఎస్ స్పీడుతో డేటాను అందిస్తామంటే ఎవరు మాత్రం వద్దంటారు.
అతి తక్కువ చార్జీలకే నాలుగు నూతన బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను ఆవిష్కరించింది. కాకపోతే ఇవన్నీ కూడా కొత్తగా బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు తీసుకునే వారికి మాత్రమే. ఇప్పటికే యూజర్లుగా ఉన్న వారి కోసం కాదు. రూ.99 ప్లాన్ కింద ప్రతి రోజూ 1.5జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. 30 రోజుల పాటు ప్రతి రోజూ 20ఎంబీపీఎస్ వేగంతో కూడిన 1.5జీబీ డేటా చొప్పున, నెలలో మొత్తం 45జీబీ హైస్పీడ్ డేటా పొందొచ్చు. ఏదైనా ఒక రోజు 1.5జీబీ డేటా క్రాస్ అయితే అప్పుడు వేగం 1ఎంబీపీఎస్ కు పడిపోతుంది.
ఇక రూ.199 ప్లాన్ కింద బీఎస్ఎన్ఎల్ 150జీబీ ఉచిత డేటాను ఆఫర్ చేస్తోంది. అంటే ప్రతి రోజూ 20ఎంబీపీఎస్ వేగంతో కూడిన 5జీబీ డేటా ఉచితం. అలాగే, రూ.299 ప్లాన్ లో 300జీబీ డేటా, రూ.399 ప్లాన్ లో 600జీబీ డేటాను 20ఎంబీపీఎస్ వేగంతో అందుకోవచ్చు. అన్ని ప్లాన్లలోనూ రోజువారీ అధిక వేగంతో కూడిన డేటా పరిమితి దాటిన వెంటనే వేగం 1ఎంబీపీఎస్ కు తగ్గుతుంది. కొత్తగా చేరే కస్టమర్లు ఈ టారిఫ్ లను మూడు నెలల పాటే వినియోగించుకోగలరు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న ప్లాన్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more