'Restrain Bopaiah but don't delay trust vote': SC ప్రోటెం స్పీకర్ పై కాంగ్రెస్-జేడీఎస్ పిటీషన్ కొట్టివేత

Restrain bopaiah but don t delay trust vote sc

supreme court, K.G bopaiah, Vajubhai Vala, B.S. Yeddyurappa, BJP, Congress, JD(S), karnataka assembly, pro tem speaker, mukhul rothagni, kapil sibal, assembly speaker, speaker election, congress mlas, jds mlas, BS Yeddyurappa, governor, vajubhai wala, Congress, BJP, JDS, Kumara Swamy, hyderabad, kochi, Siddaramaiah, PM Modi, Amit shah, karnataka, politics

The Supreme Court dismissed a fresh plea by the Congress-JD (S) combine, challenging appointment of K.G Bopaiah as the pro tem Speaker to conduct the crucial floor test at the Karnataka Assembly.

ప్రోటెం స్పీకర్ పై కాంగ్రెస్-జేడీఎస్ పిటీషన్ కొట్టివేత

Posted: 05/19/2018 11:04 AM IST
Restrain bopaiah but don t delay trust vote sc

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా సీనియర్ ఎమ్మెల్యే అయిన తమ సభ్యుడిని కాకుండా ఏకపక్షంగా బీజేపి పార్టీకి చెందిన సీనియర్ ను ప్రోటెం స్పీకర్ గా నియమించారని.. దీనిని సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానాన్ని అశ్రయించింది. కాగా కాంగ్రెస్ జేడీఎస్ పిటీషన్ ను విచారించిన త్రిసభ్య ధర్మాసనం వారి పిటీషన్ ను కొట్టివేసింది. ప్రోటెం స్పీకర్ నియామకాన్ని సవాల్ చేసిన క్రమంలో ఆయనకు నోటీసును ఇవ్వాలని అప్పుడే కానీ అతన్ని విచారించలేమని స్పష్టం చేసింది.

ఇలా చేయాలంటే అసెంబ్లీలో బలనిరూపణ వాయిదా వేయాల్సిన అవసరం వుంటుందని సుప్రీంకోర్టు పేర్కొనింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జేడీఎస్ పిటీషన్ ను కొట్టివేసింది. అయితే కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రోటెం స్పీకర్ బోపయ్యపై వ్యక్తం చేస్తున్న అనుమానాల నేపథ్యంలో ఆయనను కాంగ్రెస్-జేడీఎస్ అడిగిన అన్ని వినతులపై సుప్రీం ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. కర్ణాటక అసెంబ్లీలో జరగనున్న బలనిరూపణ ప్రక్రియ యావత్తును దేశంలోని అన్ని టీవీలలో లైవ్ లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని అదేశిస్తామని చెప్పింది.

ఇక రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ కు చేపట్టకుండా డివిజన్ బెంచ్ ద్వారా ముజువాణి పద్దతిలోనే ఓటింగ్ చేపట్టాలని కూడా కర్ణాటక ప్రొటెం స్పీకర్ బొపయ్యను అదేశిస్తామని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ ఎ బోబ్డే, జస్టిస్ ఏకే సిక్రీలతో కూడిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ క్రమంలో కపిల్ సిబాల్ బోపయ్య గతంలో కూడా చట్టవిరుద్దంగా వ్యవహిరించారన్న వాదనలను తోసిపుచ్చిన న్యాయస్థానం.. కాంగ్రెస్-జేడీఎస్ ప్రోటెం స్పీకర్ పై దాఖలు చేసిన 8 పేజీల పిటీషన్ ను కూడా కొట్టివేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  K.G bopaiah  Vajubhai Vala  BJP  Congress  JD(S)  pro tem speaker  karnataka  politics  

Other Articles