కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ కు తీవ్రమైన అన్యాయం చేస్తుందని అరోపించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.. తన భావోద్వేగాన్ని ట్విట్టర్ ద్వారా తన ఫాలోవర్స్ తో పంచుకున్నాడు. అయితే ఆ ట్విట్ చూసిన తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ చంద్రబాబుకు ఈ తరహా ట్విట్లు చేసే అప్పుడు ఇకపై జాగ్రత్తగా వ్యవహరించాలని సూచన చేశారు. అసలేం జరిగింది..? ఇంతకీ చంద్రబాబు ఏం ట్విట్ చేశారు..? దానిపై కేటీఆర్ ఎందుకుని విభిన్నంగా స్పందించాడు అంటారా..? అక్కడికే వస్తున్నాం.
సీఎం చంద్రబాబునాయుడు ట్విట్టర్ లో చేసిన కామెంట్ తెలంగాణ వాదుల మనోభావాలను దెబ్బతీసింది. అంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీజేపి శాసనసభ్యుడు విష్ణు కుమార్ రాజు చేసిన ప్రసంగంపై సమాధానమిస్తూ.. అరుణ్ జైట్లో చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు సభలో ఊటంకించారు. అంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రత్యేక హోదా ఇవ్వాలన్న సెంటిమెంట్ బలంగా వుందని, ప్రత్యేక హోదాను కాదన్నా.. కనీసం ఫ్యాకేజీతోనైనా అర్థికంగా ఇబ్బందుల్లో వున్న రాష్ట్రాన్ని అదుకోవాలన్నది ప్రజల అభిమతమని చంద్రబాబు అన్నారు. అయితే ప్రజల్లో సెంటిమెంట్ వుంది కాదా, అని కేంద్రం ప్రత్యేక హాదానో, లేక ప్యాకేజీ ఇవ్వజాలదని కేంద్ర అర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు అసెంబ్లీలో ప్రస్తావించారు.
అయితే సెంటిమెంట్ వుందన్న కారణంగానే తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆయన అదనపు వ్యాఖ్యలు చేసిన వాటిని కూడా ట్విట్టర్లో పెట్టారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సాధన స్వయం పాలనకు స్వగౌరవంతో జరిగిన ఉద్యమమని, ఈ క్రమంలో ప్రజలు చేసిన త్యాగాలను, అమరవీరుల ఆత్మార్పణలను మరువరాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో అనేక రకాలుగా కేంద్రం తమకు ప్యాకేజీలను కూడా ఇవ్వజూపిందని, అయినా తాము రాష్ట్ర విప్రజలు ఆత్మగౌరవంతో పోరాడి రాష్ట్రాన్ని సాధించారు.
పోరాటాన్ని నీరుగార్చటానికి ఎన్నో ప్రయత్నాలు, కుట్రలు జరిగాయి. ఎన్నో ప్యాకేజీలతో మభ్యపెట్టటానికి ప్రయత్నించినా వాటికి ఆశ పడకుండా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏపీ హక్కుల కోసం చంద్రబాబు పోరాడవచ్చు, ఉద్యమించవచ్చు.. కానీ తెలంగాణ ప్రజలను తక్కువ చేసి మాట్లాడొద్దంటూ ట్విట్టర్ ద్వారా బదులిచ్చారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాలు, బాష, యాస, స్వగౌరవం, స్వయం పాలన ఇత్యాదులన్నీ కలగలిసింది తెలంగాణ ఉద్యమమని కేటీఆర్ అన్నారు.
కేంద్ర మంత్రి గారు ఓ మాట అన్నారు. 'సెంటి మెంట్కు డబ్బులు రావు' అని. కానీ ఆయన ఒకటి గుర్తుంచుకోవాలి సెంటి మెంట్ కోసమే 'తెలంగాణ' రాష్ట్రాన్ని ఇచ్చారు.
— N Chandrababu Naidu (@ncbn) March 12, 2018
Sir, with all due respect we, the people of Telangana never flip-flopped in our demand for statehood. Never ever settled for any package even when many were offered
You can fight for your rights but do not belittle and undermine the struggle & sacrifices of people of Telangana
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more