ఉత్తరప్రదేశ్ లో మా బలానికి తిరుగులేదు.. గడిచిన సార్వత్రిక ఎన్నికల నుంచి ఇటీవల జరిగిన ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వరకు జరిగిన ఎన్నికలలో వచ్చిన ఫలితాలే మా మాటలకు నిదర్శనమని చెప్పిన కేంద్ర, రాష్ట్రాలలో అధికారంలో వున్న బీజేపికి ఓటర్లు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ ప్రాతినిధ్య వహించిన గొరఖ్ పూర్ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రాతినిధ్యం వహించిన ఫూల్ పుర్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో బీజేపికి ఎదురుగాలి వీచింది. తొలి రౌండ్ నుంచి అదిక్యాన్ని ప్రదర్శిస్తున్న సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులు పది రౌండ్లు ముగిసిన అనంతరం అధికార పార్టీ అభ్యర్థులపై స్పష్టమైన మెజారిటీని సాధించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఓట్ల లెక్కింపు కేంద్రాల నుంచి మీడియాను బయటకు పంపించారు. దీంతో ఫూల్ పూర్ సమాజ్ వాదీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి మీడియాను భయటకు పంపి.. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించే యత్నాలకు స్థానిక ఎన్నికల కౌంటింగ్ సిబ్బందితో కలసి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు యత్నిస్తున్నారని అరోపిస్తూ లేఖ రాశారు. దీంతో అప్పటి వరకు స్థానిక మీడియా మాత్రమే ప్రాథాన్యత ఇచ్చిన ఈ ఉప ఎన్నికలు లెక్కింపు కేంద్రాలకు జాతీయ మీడియా కూడా చేరుకోవడంతో.. పోలీసులు నిమ్మకుండిపోయారు.
ఇదిలావుండగా, కడపటి వార్తలు అందే సమయానికి ఉత్తర్ ప్రదేశ్ లోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఫుల్ పూర్, గోరఖ్ పూర్ లలో సమాజ్ వాదీ పార్టీ స్పష్టమైన అధిక్యతను సొంతం చేసుకుని విజయం దిశగా పరుగులు వేస్తుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం ప్రతినిత్యం వహిస్తున్న ఫుల్ పూర్ లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి సుమారు 21 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా, అటు సీఎం యోగి అధిత్యనాథ్ ప్రతినిధ్యం వహిస్తున్న గోరఖ్ పూర్ లో బీజేపి అభ్యర్థిపై సమాజ్ వాదీ అభ్యర్థి 14 వేల 648 ఓట్ల మెజారిటీతో విజయం దిశగా దూసుకుపోతున్నారు.
ఇదిలావుండగా, బీహర్ లో మాత్రం బీజేపి తన ఇంతకుముందు ఎన్నికలలో కైవసం చేసుకున్న స్థానాలను తిరిగి నిలుపుకునే దిశగా కోనసాగుతుంది. బీహార్ లోని ఆరార్యా లోక్ సభ స్థానంలో అది నుంచి అధిపత్యం ప్రదర్శించిన బీజేపి.. కౌంటింగ్ కీలక దశకు చేరుకోగానే వెనకంజలోకి జారుకుంది. ఈ నెల 11న జరిగిన ఉప ఎన్నికలలో అర్జేడీ అభ్యర్థి సర్పరాజ్ అలామ్.. బీజేపి అభ్యర్థి ప్రదీప్ కుమార్ సింగ్ పై 23 వేల ఓట్ల అధిక్యంలో దూసుకెళ్తున్నారు. దీంతో ఈ స్థానాన్ని తిరిగి అర్జేడీ నిలబెట్టుకుంటుందని అంచనాలు సాగుతున్నాయి.
ఇక బీహార్ లోని రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో బీజేపి అర్జీడి పార్టీలు తమ స్థానాలను నిలబెట్టకునే దిశగా సాగుతున్నాయి. భాభువా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపికి చెందిన రింకి రాణీ పాండే అధిక్యంతో దూసుకెళ్తుండగా, జెహనాబాద్ అసెంబ్లీ స్థానంలో అర్జేడీ అభ్యర్థి కుమార్ క్రిష్ణ మోహన్ యాదవ్ విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే యూపీ లోని రెండు, బీహార్ లోని ఒకటి కలుపుకుని మొత్తంగా మూడు లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో మోడీ మానియా మసకబారిందా..? యోగి చరిష్మ అంటకాగిందా..? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి.
#ResultsWithNDTV | BJP confronts big setback, trails in key UP elections
— NDTV (@ndtv) March 14, 2018
Read more here: https://t.co/C77gs3Rlof#UttarPradeshByPolls #BiharByPolls pic.twitter.com/iAOOnWqSsr
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more