నటి శ్రీదేవి అంత్యక్రియలు అనుకున్న సమయానికి కన్నా ఆలస్యంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దుబాయ్ లోని జుమీరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్ లో శనివారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. శ్రీదేవి బౌతికకాయానికి పోస్టు మార్టం పూర్తయిందని తాజాగా యూఏఈకి చెంది ఖలీజా టైమ్స్ పేర్కొంది.
ఆలస్యానికి కారణాలు..
పోస్ట్ మార్టం తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అందగానే బాడీ పాడవకుండా వైద్యులు ఎంబామింగ్ చేస్తారు. ఆ తరువాత వైద్యులు ఆమె మృతదేహాన్ని పోలీసులకు హ్యాండోవర్ చేస్తారు. వారు డెత్ సర్టిఫికెట్ ఇష్యూ చేసి, దానిని అక్కడి పబ్లిక్ ప్రాసిక్యూటర్ హ్యాండోవర్ చేసుకునేందుకు పర్మిషన్ ఇస్తారు.
ఈ నిబంధనలు పూర్తయిన వెంటనే శ్రీదేవి మృతదేహాన్ని రిలయన్స్ కు చెందిన విమానంలో భారత్ కు తీసుకురానున్నారు. నేటి సాయంత్రానికి శ్రీదేవి భౌతికకాయం ముంబై చేరుకుంటుందని భావిస్తున్నారు. దీంతో అంత్యక్రియలు అనుకున్న సమయానికి పూర్తవటం అనుమానంగా కనిపిస్తోంది. సాయంత్రం 5.30 కల్లా ఆమె మృతదేహాం చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అనుమానాలెందుకు?
ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతి విషయంలో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు అందరికీ తెలిసిన సమాచారం ప్రకారం శ్రీదేవి మరణించిన సమయంలో ఆమె భర్త బోనీకపూర్ కూడా హోటల్లోనే ఉన్నారు. ఆమె మరణించిన విషయాన్ని తొలుత ఆయనే గుర్తించారు. కానీ, ఇప్పడు సంచలన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీదేవి మృత దేహాన్ని హోటల్ సిబ్బందే గుర్తించారట. ఆమె చనిపోయినప్పుడు బోనీ కపూర్ ఇండియాలోనే ఉన్నారని చెబుతున్నారు.
ఆమె మరణం పట్ల ఆమె కుటుంబసభ్యుల్లో కూడా పలు సందేహాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆమె మరణించిన 36 గంటల తర్వాత క్లియరెన్స్ ఇవ్వండంపై సందేహాలు తలెత్తుతున్నాయి. యావత్ భారత దేశాన్ని కుదిపేసిన ఓ సెలబ్రిటీది సాధారణ మరణం అయినప్పుడు... క్లియరెన్స్ ఇవ్వడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందని సందేహపడుతున్నారు. గుండెపోటు కారణంగానే శ్రీదేవి మరణించిందంటూ దుబాయ్ వైద్యులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో రెండేసి కథనాలతో శ్రీదేవి మరణంపై స్పష్టత లేకుండా గందరగోళం రేగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more