కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్న క్రమంలో అధికార పార్టీ నుంచి సంతృప్తికరమైన నిర్ణయం రాకపోయినా.. లోక్సభలో వివిధ పార్టీల మద్ధతు సాధించడంలో టీడీపీ ఎంపీలు విజయం సాధించారు. మరీ ముఖ్యంగా బీజేపీ కురువృద్ధుడు ఎల్కే ఆద్వానీ టీడీపీ ఎంపీలకు లోక్ సభలో సూచనలు చేశారు. సభా మర్యాదలు పాటిస్తూ నిరసన వ్యక్తం చేయాలని ఆద్వానీ, ఎంపీలకు సూచించారు. వేరే దారి లేకే వెల్ లోకి వచ్చామని టీడీపీ ఎంపీలు బదులిచ్చారు. టీడీపీ ఎంపీలతో ఆద్వానీ 10 నిమిషాలపాటు మాట్లాడారు. ఏపీ సమస్యలపై అరుణ్ జైట్లీతో కూడా మాట్లాడానని, ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆడ్వాణీ వ్యాఖ్యానించారు.
ఇప్పటికే ఏపీకి బడ్జెట్లో జరిగిన అన్యాయంపై ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాలు మద్ధతు తెలుపుతున్నాయి. అకాళీదల్, శివసేన, తృణాముల్ కాంగ్రెస్ పార్టీలు ఏపీకి జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ ఎంపీలు కవిత, జితేందర్రెడ్డి టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనకు మద్ధతు తెలిపారు. ఏపీ ఎంపీల నిరసనలకు మద్దతిస్తున్నట్లు కవిత ప్రకటించారు. సుమారు 10 నిమిషాల పాటు కవిత ఏపీ సమస్యల గురించి మాట్లాడారు. చివరగా ‘జై ఆంధ్రా’ అంటూ కవిత తన ప్రసంగాన్ని కవిత ముగించారు. బుధవారం రోజు టీఆర్ఎస్ ఎంపీ జితేందర్రెడ్డి కూడా ఏపీ ఎంపీలకు మద్దతిచ్చారు.
అయితే టీడీపీ ఎంపీలు మాత్రం తమ పట్టు విడలేదు. టీడీపీ ఎంపీల నిరసనలతో పార్లమెంట్ దద్దరిల్లింది. ఉభయసభల్లో టీడీపీ ఎంపీలు నిరసనలు కొనసాగించారు. విభజన హామీలు అమలు చేయాలంటూ లోక్సభలో వరుసగా ఐదోరోజు టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. శుక్రవారం ఉదయం సభ మొదలైన వెంటనే టీడీపీ ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి నిరసనకు దిగారు. బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ నినాదాలు చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ వారించినా ఎంపీలు తమ నిరసనను కొనసాగించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more