జనవరి 31న యావత్ ప్రపంచం.. 152 ఏళ్ల తరువాత దాదాపుగా 78 నిమిషాల పాటు సంభవించిన సంపూర్ణ రహుగ్రస్త చంద్రగ్రహణాన్ని ఎంతో ఆసక్తిగా వీక్షించగా, నాసా సహా పలు దేశాల శాస్త్రవేత్తలు మాత్రం గ్రహణం సమయంలో పలు పరిశోధనలకు సముచిత సమయమని భావించి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే భూగ్రహంపై నున్న శాస్త్రవేత్తలే కాకుండా ఏకంగా గ్రహాంతరవాసులు కూడా ఇలాంటి పరిశోధనలే చేశారా..? అన్న అనుమానాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుండటంతో అసలు గ్రహాంతర వాసులు వున్నారా..? అన్న అంశానికి కూడా చెక్ పడినట్టేనన్న వాదనలు వినబడుతున్నాయి. ఈ వీడియోలో ఏలియన్ హంటర్లకు యూఎఫ్ఓ కనిపించడం ఆసక్తిరేపుతోంది. గ్రహణం సమయంలో చంద్రుడి పక్కనుంచి మెరుపు వేగంతో వెళ్లిన ఒక వస్తువు కనిపించింది.
అది కూడా క్రమంగా వెలుతురును విరజిమ్ముతూ వెళ్లడంతో అది గ్రహాంతరవాసులకు సంబంధించిన యూఎఫ్ఓ అని భావిస్తున్నారు. అంతేకాదు గ్రహాంతరవాసులు ఆ యూఎఫ్ఓలో చంద్రుడిపైకి వెళ్లి గ్రహణం పట్టిన తరువాత చంద్రుడిని వీడి వెళ్తున్నారని కూడా ఏలియన్ హంటర్ల భావిస్తున్నారు. నాసా విడుదల చేసిన వీడియోలో కూడా ఈ వస్తువు కనిపించడంతో ఏలియన్ హంటర్లు.. అది గ్రహాంతరవాసులకు చెందిన అంతరిక్షవాహనమని, అందులో వారు పరిశోధనల నిమిత్తం ప్రయాణిస్తున్నారని.. ఏలియన్స్ ఉన్నారనేందుకు ఇదే నిదర్శనమని కూడా బల్లగుద్ది వాదిస్తున్నారు.
మనిషి తయారు చేసిన ఏ వాహనం కూడా అంతటి మెరుపు వేగంతో ప్రయాణించడం సాధ్యం కాదని కూడా ఏలియన్ హంటర్ల తేల్చిచెబుతున్నారు. యూఎఫ్ఓ మానియా అనే చానెల్ పోస్టు చేసిన ఈ వీడియోను కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే లక్షా 27 వేల 800 మందికిపైగా వీక్షించారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఏలియన్ హంటర్ల వాదనలను తోసిపుచ్చుతున్నారు. అది బోయింగ్ ఎయిర్ క్రాప్ట్ లేదా వెదర్ బెలూన్ అయ్యివుండవచ్చునని పేర్కొంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more