సూర్యుడు, భూమి, చంద్ర గ్రహాలు భ్రమణాలు చేస్తూ.. ఈ మూడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే భూమి చంద్రగ్రహాలకు మధ్యన రాహు గ్రహం వచ్చి చంద్రుడ్ని మింగేస్తుందని అప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుందని వేదపండితులు, జోతిష్యులు చెబుతుంటారు. సూర్యుడు, భూమి ఎప్పుడూ ఒకే మార్గంలో ఉన్నప్పటికి చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు అటూ ఇటూగా తిరుగుతుంటాడు.
ఈ క్రమంలో సూర్య, చంద్రుల మధ్యలో భూమి వచ్చిన రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంటుందన్నది సైన్స్ చెబుతున్న వాస్తవం. అయితే సైన్స్ చెప్పేందుకు ముందు మన జ్యోతిష్యులు రాహు గ్రహ స్యూర్య చంద్రులను మింగేస్తాయని, తద్వారా గ్రహణాలు ఏర్పడతాయని చెబుతున్నారు. ఈక్రమంలో భూమి ఛాయ చంద్రబింబాన్ని పూర్తిగా కప్పేస్తే, సంఫూర్ణ గ్రహణమనీ, కొంత భాగాన్ని కప్పేస్తే పాక్షిక గ్రహణమని సైన్స్ చెబుతుండగా, అది రాహుగ్రహమని జ్యొతిష్యులు వాదిస్తున్నారు.
ఇవాళ పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో కర్కాటక రాశిలో సాయంత్రం 5:18 మొదలు రాత్రి 8:41 వరకు కర్కాటక, సింహలగ్నాలలో రాహు గస్త సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవిస్తుంది. సా. 6:22 గంటలకు సంపూర్ణ స్థాయిలోకి ప్రవేశించే గ్రహణం, రాత్రి. 7:38 తరువాత విడుపు దశకు చేరుతుంది. రాత్రి 8.40 నిమిషాలకు సంపూర్ణ విడుపు జరుగుతుంది. మొత్తం గ్రహణ సమయం 3 గంటల 23 నిమిషాలు. ఈ గ్రహణం ఇండియా సహా, ఆసియా, అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి ప్రాంతాల్లో కనిపిస్తుంది.
ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం:
హిందూ సంప్రదాయం, భారత జ్యోతిష్య శాస్త్రం, పంచాగాలను అనుసరించి, గ్రహణాలు ఏర్పడినప్పుడు మూడు బోజన నియమాలు పాటించడంతో పాటు స్నానం, దానం విషయంలో హైందవులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుందని జ్యోతిష్యులు పేర్కోంటున్నారు. అయితే దీనిని హేతువాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అసలు రాహుగ్రహమే లేదని, లేని గ్రహాలు ప్రజలపై ఎలా ప్రభావం చూపుతాయని ప్రశ్నిస్తున్నారు.
నీడను చూపించి జ్యోతిష్యులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి నుంచి డబ్బులు లాగుతున్నారని వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం.. మా ధర్మమని, పాటిస్తారా.? పాటించరా..? అన్నది ఎవరి ఇష్టాఇష్టాలను భట్టి వారు పాటిస్తుంటారని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహనం ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందన్న విషయాల్లోకి వెళ్తే..
ఇక ఈ గ్రహణం కర్కాటకరాశిలో ఏర్పడటం మరియు ఆ రాశి నుండి సప్తమ దృష్టి మకర రాశిపై ఉండటంతో ఈ రెండు రాశులవారు, పుష్యమి, ఆశ్లేష, మఖ నక్షత్రాల వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ధనస్సు, మేషం, కర్కాటక, సింహ రాశుల వారికి ఈ గ్రహణం అధమ ఫలాన్ని ఇస్తుందని, వృశ్చిక, మకర, మీన, మిధున రాశుల వారికి మధ్యమ ఫలం దక్కుతుందని, కన్య, తుల, కుంభ, వృషభ రాశుల వారికి శుభ ఫలములు అందుతాయని అంటున్నారు.
ఇక చంద్రగ్రహణ నిబంధనల విషయానికి వస్తే, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రత్యక్షంగా చూడకూడదు. 'కదలకుండా పడుకోవాలి' అన్నది అవాస్తవం. ఇంట్లో అన్ని పనులూ చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో దాదాపు ఏ ఆహారాన్నీ తీసుకోకపోవడమే మంచిది. ఆ తరువాత కూడా కొత్తగా వండుకున్నవి తింటేనే మేలని కూడా జ్యోతిష్యులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో నిలువ ఉన్న ఆహార పదార్ధాలు విష స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి, గ్రహణం ముగిసిన తరువాత వండుకిని తినాలని సూచిస్తున్నారు.
మరీ శాస్త్రీయ పద్ధతులను, హిందూ సంప్రదాయాన్ని అనుసరించాలని భావించే వారు, గ్రహణం ముందు, గ్రహణ సమయంలో, గ్రహణం తరువాత స్నానాలు చేసి ధ్యానం చేస్తూ ఉండవచ్చు. గ్రహణం పూర్తి తరువాత ఇంటిని శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. దేవుడి విగ్రహాలను శుభ్రం చేసుకోవాలి. జంధ్యం వేసుకునే సంప్రదాయం ఉన్నవారు దాన్ని మార్చుకోవాలి. ఇంటిముందు, వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయలు, కొబ్బరి కాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి కట్టించుకుంటే, గ్రహణ దృష్టి తొలగి శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more