దాణా కుంభకోణంలో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మూడోస్సారి కూడా దోషిగా తేలారు. ఈ మేరకు లాలూపై మోపబడిన అభియోగాలను విచారించిన రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ మేరకు దోషిగా తేల్చింది. బీహార్ సహా దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన దాణా కుంభకోణంపై దాఖలైన పలు కేసులను విచారించిన న్యాయస్థానం ఇప్పటికే రెండు కేసులకు సంబందించి ఆయనను దోషిగా తేల్చి శిక్షను కూడా వెలువరించింది.
ఈ నేపథ్యంలో ధాఖలైన చైబాస ట్రెజరీ దాణా స్కామ్ కేసులోనూ లాలూ ప్రసాద్ యాదవ్ ను ఇవాళ మూడోస్సారి దోషిగా తేల్చింది. ఇదివరకే రెండు కేసులకు సంబంధించి లాలూను సీబిఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్థారించిందింది. న్యాయస్థానం శిక్షలను కూడా ఖారారు చేయడంతో ప్రస్తుతం అయన జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఇక తాజా కేసుకు సంబంధించి కూడా ఆయన దోషిగా తేలారు.
కాగా ఈ మూడో కేసుకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాలకు చెరో ఐదేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. దీంతోపాటు చెరో రూ. 5 లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో మొత్తం 76 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో విచారణ సమయంలో 14 మంది చనిపోయారు. ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. ఇద్దరికి శిక్ష పడగా, ఒకరు పరారీలో ఉన్నారు. విచారణ ఎదుర్కొన్న మిగిలిన 56 మందిలో ఆరుగులు రాజకీయ నేతలు, ముగ్గురు మాజీ ఐఏఎస్ అధికారులు, ఆరుగురు పశుసంవర్ధక శాఖ అధికారులు, ఒక ట్రెజరీ అధికారి, 40 మంది దాణా సరఫరాదారులు ఉన్నారు.
బిహార్ రాష్ట్రంలో1990 తర్వాత చోటు చేసుకున్న దాణా స్కామ్ పై పలు కేసులను సీబీఐ కోర్టు విచారణ జరుపుతోంది. 1992-93లో చై బాసా ట్రెజరీ నుంచి అక్రమంగా రూ.33.67 కోట్లను డ్రా చేసినందుకు బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాను కూడా సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. దీనిపై ఎగువ కోర్టులో సవాలు చేయనున్నట్టు ఆర్జేడీ ఓ ప్రకటన చేసింది. ప్రస్తుతం లాలూ రాంచిలోని బిస్రాముండా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more