కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యవసర సరుకుల ధరలను కేవలం 100 రోజుల్లోనే తగ్గిస్తామని, ఆ తరువాత నిరంతర పర్యవేక్షణ కూడా కొనసాగుతుందని చెప్పిన ప్రభుత్వం.. నిత్యావసర సరుకుల ధరలను ప్రభావితం చేసే డీజిల్ ధరలను కూడా అంతర్జాతీయ మార్కెట్ల కు అనుగూణంగా పెంచనుండడంతో.. తొలినాళ్లలో తగ్గిన ధరలు.. ఆ తరువాత పెరుగుతూనే వచ్చాయి. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీజిల్ ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. మునుపెన్నడూ లేని విధంగా ధరలు అకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ఇటు నిత్యావసర సరుకులు కూడా పెరుతూనే వున్నాయి.
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా పెరగడంతో, దేశంలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఎల్పీజీ ఇంధన ధరలు భారీగా పైకి పెరుగుతున్నట్టు తెలిసింది. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ఢిల్లీలో లీటరు డీజిల్ ను రూ.59.70కు విక్రయించినట్టు తెలిసింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక స్థాయి. కోల్ కత్తా, చెన్నైలో కూడా డీజిల్ ధరలు నాలుగేళ్ల క్రితం నాటి గరిష్టాలను తాకి కొనసాగుతున్నాయి. మరోలా చెప్పాలంటే 2014 సెప్టెంబర్ నాటి గరిష్ట స్థాయిలను నమోదుచేస్తున్నాయి. ముంబైలో కూడా డీజిల్ ధరలు 2017 మార్చి నాటి స్థాయిలను నమోదుచేస్తున్నట్టు తెలిసింది.
అదేవిధంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కత్తా, మిగతా నగరాల్లో పెట్రోల్ ధరలు కూడా 2017 అక్టోబర్ 3 నాటి అత్యధిక ధరలు పలుకుతున్నట్టు వెల్లడైంది. అంతర్జాతీయంగా చమురు ధరలు రెక్కలు రావడంతో.. దేశంలో కూడా ఇంధనానికి రెక్కలు వస్తున్నాయి. కాగా, అంతర్జాతీయంగా ధరలు తగ్గిన క్రమంలో పలుమార్లు ఎక్సైజ్ డ్యూటీని పెంచిన కేంద్రం.. కస్టమర్లకు కాస్త ఉపశమనం కల్పించడానికి అక్టోబర్ ఎక్సైజ్ డ్యూటీని రూ.2 తగ్గించింది. అయినా అంతర్జాతీయా మార్కెట్లో ధరలు పెరుగుతూనే వుండటంతో ఇటు దేశంలోని వాహనదారులపై కూడా దాని ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్తితులకు వాహనదారులు చేరుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more