ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ వైద్య కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మెళనంలో మద్యం ఏరులై పారడంతో పాటు మద్యాన్ని తీసుకువచ్చేందుకు ఏకంగా అంబులెన్సునే వినియోగించడం.. అంతేకాక.. రష్యన్ బెల్లీ డ్యాన్సర్లతో అసభ్య నృత్యాలు వేయించడంతో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ సీరియస్ అయ్యారు. రోగులకు అంబులెన్సులు పంపాలంటే వెయ్యి షరుతులు పెట్టే వైద్యులు, వైద్య సిబ్బంది.. మద్యాన్ని తెప్పించడానికి మాత్రం అంబులెన్సును వినియోగించడంతో నెట్ జనులు కూడా తీవ్రంగా స్పందించారు.
దీంతో ముఖ్యమంత్రి జిల్లా మేజిస్ట్రేట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్లను మందలించారు. దీంతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని, మీడియా ద్వారానే తనకూ తెలిసిందని తాత్కాలిక ప్రిన్సిపాల్ వినయ్ అగర్వాల్ తెలిపారు. సంబంధిత వైద్య అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు చేపట్టాలని అదేశించారు.
మీరట్లోని లాలా లజపత్ రాయ్ మెడికల్ కాలేజీలోనూ ఇటువంటి దృశ్యం కనిపించింది. ఇప్పుడీ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. కొందరు ఇందుకు సంబంధించిన వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. అది కాస్తా వైరల్ అయ్యింది. 1992 బ్యాచ్కు చెందిన వైద్యులు తాజాగా పూర్వవిద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఓల్డ్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ను ఏర్పాటు చేశారు.
అంతవరకు బాగానే ఉన్నా.. ఈ కార్యక్రమానికి సంబంధించి బయటకు వచ్చిన వీడియో ఒకటి ఇప్పుడు సంచలనం రేపింది. బయట ఆసుపత్రి ఆవరణలో నిలిపి ఉంచిన అంబులెన్స్ నిండా మద్యం బాటిళ్లు ఉన్నాయి. బార్ టెండర్లు, క్రిస్మస్ క్యాప్లను ధరించిన అమ్మాయిలు వైద్యులకు మద్యం పోస్తూ కనిపించారు. ఆ తర్వాత ఆ అమ్మాయిలు బాలీవుడ్ పాటలకు బెల్లీ డ్యాన్స్లతో హోరెత్తించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more