2019 సార్వత్రిక ఎన్నికలలో మళ్లీ అధికారంలోకి వస్తామని అధికార బీజేపీ, ఇప్పటికే ధీమాను వ్యక్తం చేస్తున్నా.. సీట్లు మాత్రం గణనీయంగా తగ్గుతాయని ఇప్పటికే పలు సర్వేసంస్థల అంచనాలు పేర్కొంటున్నాయి. గుజరాత్ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా బిజేపి ప్రభావాన్ని తగ్గిస్తాయని కూడా అంచనాలు చెబుతున్నాయి. కాగా అటు కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలను అందుకున్న రాహుల్ నేతృత్వంలో పార్టీ జోరందుకుందని, రాహుల్ కూడా పరిణితి చెందిన నేతలా వ్యవహరిస్తూ. చౌకబారు వ్యాఖ్యలు, దిగజారుడు విమర్శలకు దూరంగా. హుందాతనం కలిగిన రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం కావడంతో.. రానున్న సార్వత్రిక ఎన్నికలు ఇటు అధికార బీజేపి, అటు విపక్ష కాంగ్రెస్ మధ్యన రసవత్తర పోరుగా మారనున్నాయని తెలుస్తుంది.
అయితే ఈ సారి బీజేపీ గెలుపు నల్లేరుపై బండి నడక కాబోదని బీజేపీ మాతృసంస్థగా భావించే ఆరెస్సెస్ కూడా అభి్ప్రాయపడింది. ఈ సారి ప్రధాని మోదీకి 60 సీట్లకు పైగా తగ్గవచ్చని అంచనా వేసింది. గత ఎన్నికలలో ఏకపక్షంగా పార్లమెంటులో మెజారిటీ సాధించిన బీజేపి రానున్న ఎన్నికలలో మాత్రం మిత్రులు సహకారం తీసుకోవాల్సిందేనని అంటోంది. అందుకు గల కారణాలు ఇవీ అని ఇదమిత్థంగా చెప్పకపోయినప్పటికీ- బీజేపీ వ్యతిరేకత కాస్త పెరిగిందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అభిప్రాయం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి బీజేపికి ఎదురుగాలి వీచే అవకాశాలే ఎక్కవని అరెస్సెస్ అంచనా వేసింది.
దీనికి తోడు ఈ రాష్ట్రాలకు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా నిలిచే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల ఎన్నికలలో విజయం సాధించడం విషయాన్ని పక్కనబెడితే.. ఈ ఫలితాలు తప్పక ఆ వెనువెంటనే వచ్చే లోక్ సభ ఎన్నికలపై పడతాయని విశ్లేషకుల అంచనా. ఇక వీటితో పాటు కర్ణాటక, నాగాలాండ్, మిజోరం, మేఘాలయ, త్రిపురల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. బీజేపీ 2019 ఫలితాన్ని ఇవి ముందే చెప్పేస్తాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 64 సీట్ల కంటే ఎక్కువ రావని, కాంగ్రెస్ 100 సీట్లు సాధిస్తుందని ఆరెస్సెస్ అంచనా వేసింది. దీంతో మోదీకి, అమిత్షాకి నిద్రపట్టలేదు.
అత్యంత పకడ్బందీగా బూత్ల స్థాయి వారీగా వ్యూహం నిర్మించి అతి కష్టం మీద విజయం సాధించగలిగింది. మ్యాజిక్ ఫిగర్ కంటే కేవలం ఏడుసీట్లే ఎక్కువ వచ్చాయి ఆ పార్టీకి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోనూ బీజేపీ ఓటమి తప్పదని ఆరెస్సెస్ అంచనా. రాజస్థాన్లోనూ పరిస్థితేం బాగోలేదు. ఇక ఛత్తీ్సగఢ్లో కాంగ్రె్సకు నాయకత్వలోపం ఓ పెద్ద శాపం. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 543సీట్లకు గాను ఎన్డీయే 336 సీట్లు సాధించింది. బీజేపీ సొంతంగా 282 సాధించి మ్యాజిక్ ఫిగర్ కంటే పది సీట్లు ఎక్కువే పోగేసుకుంది. ఆ పరిస్థితి ఈ మారు ఉండదని, బీజేపీ సీట్ల సంఖ్యలోనే దాదాపు 60 తగ్గవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more