మూడున్నరేళ్ల పాలనపై విమర్శలు.. పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజల్లో పెరిగిపోతున్న అసంతృప్తి.. మిత్ర పక్షం అయినప్పటికీ బాబుపై పెదవి విరుస్తున్న బీజేపీ... క్రమక్రమంగా బలపడుతున్న ప్రతిపక్షాలు. ఇన్నీ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సీట్ల కేటాయింపుల పై దృష్టిసారించటం పార్టీ నేతల్లో కలవరపాటుకు గురిచేస్తోంది. మొహమాటాలకు పోయి ఎవరికీ టికెట్లు ఇచ్చే పరిస్థితి తెచ్చుకోబోనని మంగళవారం నిర్వహించిన సమన్వయ కమిటీలో చంద్రబాబు స్పష్టంగా చెప్పేశారు.
పదవుల వద్ద సాన్నిహిత్యాన్ని చూడబోనని, సన్నిహితులని భావిస్తే, ఇంటికి పిలిచి అన్నం పెడతానే తప్ప, టికెట్లు ఆఫర్ చేయబోనని తెగేసి చెప్పినట్లు సమాచరాం. అన్ని నియోజకవర్గాల నుంచి కేవలం పార్టీ ఇస్తున్న సమాచారంపై మాత్రమే ఆధారపడటం లేదని, తనకున్న వివిధ మార్గాల ద్వారా కూడా సమాచారాన్ని తెప్పించుకుని సమీక్షిస్తున్నానని ఆయన చెప్పారంట. సీనియర్లు కూడా అందుకు అతీతం కాదని.. గెలిచే అవకాశాలు ఉన్న వారినే బరిలో దింపుతామని ఆయన తేల్చేశారు. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపులు వాటి ఆధారంగానే ఉంటాయని కూడా చెప్పటంతో తదుపరి ఎన్నికల్లో కూడా సీట్లు ఆశిస్తున్న వారు మానసిక వేదనకు గురవుతున్నారు.
ఇదే సమయంలో వైకాపా నుంచి ఫిరాయించిన ప్రతి ఎమ్మెల్యేకూ తదుపరి ఎన్నికల్లో చాన్స్ ఇస్తానని చంద్రబాబు నుంచి హామీ లభించినట్లు ఓ వార్త చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అదే జరిగితే, ఆయా నియోజకవర్గాల్లో తమ పరిస్థితి ఏంటని గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ నేతలు.. పార్టీ కోసం పని చేస్తున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వారు పార్టీలు మారే అవకాశాలు ఉన్నాయన్నది విశ్లేషకుల వాదన.
ఇక ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంతో ప్రభుత్వంపై విమర్శలు కొంత మేరకు తగ్గాయని, అయితే, ప్రస్తుతమున్న 54 శాతం ప్రజా సంతృప్త స్థాయిని డిసెంబర్ నాటికి 59 శాతానికి తీసుకెళ్లాలని చంద్రబాబు తన ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులకు సూచించారంట. ముఖ్యంగా అగ్రిగోల్డ్ సమస్య, నిరుద్యోగ భృతి, ఫాతిమా కళాశాల విద్యార్థుల సమస్యలు, కడప స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు వంటి వాటిని ఒక్కొక్కటిగా ఎన్నికల నాటికి పూర్తి చేద్దామని నిర్ణయించుకున్నట్టు ఆయన వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more