జీవితభీమా పాలసీలకు అధార్ నెంబరుతో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేస్తూ.. ఇన్సూరెన్స్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ అప్ ఇండియా ఇటీవల అదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి కూడా డిసెంబర్ 31ని చివరి గడువు తేదీగా నిర్ణయించిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు అగంతకులు ఇన్సూరెస్స్ హోలర్స్ నుంచి వారి వ్యక్తిగత వివరాలను రాబట్టుకునేందుకు రంగప్రవేశం చేశారు. తీరా దీనిపై సమాచారం అందుకున్న ఎల్ఐసీ సంస్థ.. చివరాఖరున మేల్కోని ఇలాంటి ఎస్ఎంఎస్ లను ఎవరూ విశ్వసించవద్దని అలర్గ్ చేసే ప్రయత్నాన్ని ప్రారంభించింది.
మీ జీవితభీమా పాలసీని అధార్ తో లింక్ చేయని పక్షంలో ఫలానా నెంబర్ కు ఎస్ఎంఎస్ ద్వారా పాలసీని వివరాలతో పాటు ఆధార్ కార్డు నెంబరును జత చేసుకోవాలంటూ అగంతకులు ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువరు ఎల్ఐసీ ఖాతాదారులకు ఎస్ఎంఎస్ సందేశాలను పంపారు. దీనిపై ఎల్ఐసీ తాజాగా స్పందించింది. మీరు ఎల్ఐసీ పాలసీదారులా? మీ పాలసీని ఆధార్ కార్డుతో ఎస్ఎంఎస్ ద్వారా అనుసంధానం చేసుకోవాలని మొబైల్స్ కు వచ్చిన సందేశాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. అంతేకాదు ఇలాంటి వార్తలు నమ్మి.. మోసపోవద్దని సూచించింది.
ప్రముఖ బీమా సంస్థ ఎల్ఐసీ చెప్పిన వివరాలు ఏమిటేంటే... సోషల్ మీడియాలో వస్తున్న అలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని సూచించింది. అలాంటి సందేశమేదీ ఎల్ఐసీ జారీ చేయలేదని, ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్ కార్డును అనుసంధానం చేసుకునే సదుపాయమేదీ ప్రస్తుతానికి కల్పించలేదని పేర్కొంది. ఒక వేళ ఆ సదుపాయాన్ని కల్పించినట్లయితే ఆ వివరాలను తమ వెబ్ సైట్లో పొందుపరుస్తామని తెలిపింది. మీ వ్యక్తిగత వివరాలు పంచుకోవాల్సిన వచ్చినప్పుడు ముందుగా స్థానిక ఎల్ఐసీ శాక కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more