దేశ రాజధాని ఢిల్లీలో కార్పోరేట్ వైద్యం మాటున జరుగుతున్న ధన దోపిడి వెలుగుచూడటంతో నివ్వెరపోయిన దేశప్రజలు.. ఈ ఘటనను తీవ్రంగా విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసిన తరువాత కూడా దేశంలోని కార్పోరేట్ అసుపత్రులు మేల్కోన్నట్లు లేదు. దేశంలో వైద్యం పేరుతో వైద్యులు ధనభక్షకుల మాదిరిగా తయారవుతున్నారనడానికి ఈ ఘటన మరో నిదర్శంన. అభం శుభం తెలియని పదేళ్ల పసివాడు.. సరిగ్గా డబ్బులు కూడా చేత పట్టుకొవడం తెలియని ప్రాయం, డబ్బంటే ఏంటో కూడా తెలియదు, దాంతో చాకెట్లు, బిస్కెట్లు కొనడం మాత్రమే తెలిసిన పసివాడికి పెనుకష్టం వచ్చింది.
తల్లి చాటు బిడ్డగా వుండే ఈ వయస్సు పిల్లాడ్ని కార్పోరేట్ అసుపత్రి ఏకంగా యాచకుడిగా మార్చింది. కనీసం మానవత్వం కూడా లేని వైద్యులు పసివాడికి తన తల్లి కావాలంటే డబ్బు తీసుకురావాలని అస్పత్రి యాజమాన్యం నుంచి గెంటి వేసింది. తన తల్లిని చేరుకునేందుకు మరో మార్గం లేక ఆ పసివాడు బిక్షగాడిగా మారి.. వీధి వీధి తిరిగుతూ యాచిస్తున్నాడు. అయినా ఎందరో యాచకుల నడుమ ఈ బాలుడ్ని చూసే వారెవరూ.. డబ్బులేసే వారెవరు..? అటు అసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న తన తల్లిని చూడాలన్న అకాంక్ష తీరేదెప్పుడు. తన తల్లి ఒడిలో సేదతీరేదన్నడు..?
ఈ విషాదకర ఘటన బీహార్లోని మధేపురా జిల్లా అగంకువాన్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ అబ్బాయి పేరు కుందన్. మధేపురాలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో అతని తల్లికి ఆపరేషన్ అయ్యింది. ఆపరేషన్ అనంతరం రూ. 70వేల బిల్లు రాసిచ్చింది యాజమాన్యం. అంత డబ్బుకట్టుకోలేని ఆ నిరుపేద తల్లీ, బిడ్డలకి సాయం చేసే వారెవరూ కానరాక ఆందోళనకు గురయ్యారు. పాపం ఆ చంటిబిడ్డ మాత్రం.. అమ్మకు ధైర్యం చెప్పి.. సరాసరి సొంతూరు వెళ్లాడు. అక్కడే భిక్షాటన మొదలెట్టాడు.
చివరకు ఆ పిల్లాడి బాధను గుర్తించిన మధేపురా ఎంపీ పప్పు యాదవ్.. ఆ అసుపత్రికి వెళ్లి కుందన్ తల్లిని డిశ్చార్జ్ చేయించారు. ఏకంగా పార్లమెంటు సభ్యుడే అసుపత్రికి చేరుకుని ఆ బాలుడి తల్లిని డిశార్చ్ చేయాలని కోరినా.. అసుపత్రి యాజమాన్యం మాత్రం డబ్బులు కట్టనిదే వదిలే ప్రసక్తే లేదని తేగేసి చెప్పింది. ఇక డబ్బు సకాలంలో అందకపోవడంతో ఆపరేషన్ తర్వాత వేసిన కుట్లను ఊడదీయకుండా అలాగే ఉంచేశారు. వైద్యం నిలిపివేశారు. హాస్పిటల్ నిర్వాకంపై ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more