సరిగ్గా ఏడాది క్రితం ఇదే నెలలో నోట్ల రద్దు వ్యవహారంతో గుట్టుచప్పుడు కాకుండా చెలమాణిలోకి వచ్చి చేరిన రూ. రెండు వేల నోటు.. దాదాపుకు అరు మాసాలపాటు దేశ ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసింది. కొత్తగా వచ్చిన ఈ నోటు ప్రజలు అందుకునే కన్నాముందుగానే నకిలీలు రాజ్యమేలాయి. ఏదీ అసలీ నోటో.. ఏది నకిలీనో తేల్చుకునేందుకు ప్రజలకు ఎక్కవ సమయం పట్టింది. చిల్డ్రన్స్ బ్యాంక్ అని కొన్ని నకిలీ నోట్లు రాగా, మరికొన్ని అచ్చుగుద్దినట్లు అసలు నోటుకు సరిపోలేలా నకిలీలు వచ్చేశాయి.
ఇక దేశంలోని పలు ప్రాంతాలలో ఏటీయం కేంద్రాలలోనే రూ.2000. నకిలీ నోట్లు దర్శనమివ్వడంతో అటు బ్యాంకు అధికారులు, ఇటు ప్రజలు అందోళనకు గురయ్యారు. ఇక ఏడాది తరువాత కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే వున్నాయి అనడానికి బెంగళూరులో జరిగిన ఘటనే నిదర్శనం. దయానందరెడ్డి అనే యువకుడు స్థానికంగా వున్న లక్కసంద్ర రెండో కూడలిలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంకు వెళ్లి రూ.6 వేల నగదు డ్రా చేయగా మూడు రూ.2 వేల నోట్లు వచ్చాయి.
దీంతో వాటిలోని ఓ నోటుతో సమీపంలోని పెట్రోల్ బంక్ కు వెళ్లిన దయానందరెడ్డి రూ.2 వేల నోటు ఇవ్వగా అది నకిలీ నోటు అని సిబ్బంది గుర్తించారు. దీంతో బాధితుడు లబోదిబోమన్నాడు. ఇప్పుడే బ్యాంకు ఏటీయం కేంద్రం నుంచి మూడు నోట్లు డ్రా చేశానని చెప్పాడు. నోటును నిశితంగా పరిశీలించగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అని ఉండాల్సిన చోట, దిస్ ఈజ్ షాటింగ్ పర్పస్ ఓన్లీ అని ఆంగ్ల అక్షరాల్లో ముద్రించి ఉంది. దీనిపై లక్కసంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్వీకరించలేదని, యాక్సిస్ బ్యాంక్కు వెళ్లి నకిలీ నోటును చూపించినా స్పందించలేదని బాధితుడు వాపోయాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more