ప్రపంచమంతా విస్తూ పోయే స్థాయిలో మయన్మార్లో హిందూలపై దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నీమధ్యే 20 మందికిపైగా సమాధి చేసిన ఘటన వెలుగు చూడగా, మరో వారంలోనే ఇంకో దారుణ ఘటన బయటపడింది. ఉత్తర రఖైన్లోని ఖామౌంగ్ షేక్ అనే గ్రామంలో 45 మంది హిందువుల మృతదేహాలను వెలికి తీసిన సైన్యం అదృశ్యమైన మరో 48 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టింది.
గత నెల 25న ఆర్కాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ అనే ముస్లిం తీవ్రవాద సంస్థ పిల్ల, పెద్ద, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా హిందువులను గుంపులుగా నిలబెట్టి గొంతు కోసం హత్య చేసింది. అనంతరం అందరినీ ఒకేచోట పూడ్చిపెట్టారు. ‘జాతి శుద్ధి’ పేరుతో రెండు నెలల క్రితం సైనిక చర్య మొదలైన తర్వాత తొలిసారి సైన్యం మీడియాను వెంటపెట్టుకుని ఊచకోత జరిగిన ప్రాంతాలకు తీసుకెళ్లి వారి అరాచకాలను చూపించింది. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా హతమార్చింది.
ఇప్పుడు మౌంగ్ షేక్ గ్రామంలో ఎవరిని కదిలించినా కన్నీరు కట్టలు తెంచుకుంటోంది. ముసుగులు ధరించిన కొందరు దుండగులు తమపై దాడిచేసి తమ కళ్లముందే తమవారిని చంపేశారని చెబుతున్నారు. తన కళ్ల ముందే భర్త, ఇద్దరు సోదరులు, గ్రామస్థులను చంపేశారని గ్రామానికి చెందిన రీకాధర్ కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు. తన భర్తతోపాటు వందమందిని కొండల్లోకి తీసుకెళ్లి చంపేశారని మరో మహిళ ప్రమీల తెలిపింది.
గత ఏడాది కాలంగా ముస్లిం తీవ్రవాదుల చేతుల్లో 163 మంది చనిపోగా, 91 మంది గల్లంతయ్యారని మయన్మార్ సైన్యం తెలిపింది. కాగా, ఆత్మీయులను కోల్పోయిన 5 లక్షల మందికి పైగా రోహింగ్యాలు బంగ్లాదేశ్కు పారిపోయి వచ్చారు. హిందువులను ఊచకోత కోసి గోతుల్లో పూడ్చిపెట్టిన మృతదేహాలను మయన్మార్ సైన్యం వారం రోజులుగా వెలికి తీస్తోంది. తమవారిని విగతజీవులుగా చూస్తున్న కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. వారిని ఊరడించడం ఎవరి తరమూ కావడం లేదు. ఇదిలా ఉంటే శ్రీలంకలోని రోహింగ్యాలపై బౌద్ధులు దాడులకు దిగుతున్నారు. కొలంబోలో ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న శిబిరం వద్ద బౌద్ధులు ఆందోళనకు దిగారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more