సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా.. ఉపాధ్యాయ జాతిలో చెడపుట్టిన నీచులను రాజస్థాన్ లోని శికర్ జిల్లా షహర్ పురా సర్కిల్ పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. పాఠశాలకు వచ్చే విద్యార్థీని విద్యార్థులను తమ సోంత పిల్లలా పరిగణించి విద్యాబుద్దలు చెప్పాల్సిన ఉపాధ్యయుడు.. కామంతో కళ్లుమూసుకుపోయేలా వ్యవహరించి.. తనతో పాటు పాఠశాల డైరెక్టర్ కూడా విద్యార్థినిపై అత్యాచారం చేయించాడు. విద్యార్ధిని గర్భం దాల్చడంతో అమెకు అబార్షన్ చేయించగా, అమె అరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో వారు చేసిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి.
వివరాల్లోకి వెళ్తే.. షహార్ పురా సర్కిల్ పోలీసు అధికారి కుషాల్ సింగ్ కథనం ప్రకారం.. తమ పాఠశాలలో స్థానికంగా నివసించే ఓ 18 ఏళ్ల విద్యార్థినికి స్పెషల్ క్లాసులు వున్నాయని పాఠశాలకు పిలిపించుకుని.. అమెపై ఉపాధ్యాయుడు జగత్ సింగ్ గుర్జార్ తో పాటు పాఠశాల డైరెక్టర్ జగదీష్ యాదవ్, లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించేవారు. ఇంట్లో చెబితే తప్పు తనదే అంటారని భయపడ్డ విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం చేయలేకపోయింది.
ఇక అదే అదనుగా భావించిన నిందితులిద్దరూ విద్యార్థినిన తమ అవసరాలకు అనుగూణంగా వాడుకునేవారు. ప్రతినిత్యం వారి చేతిలో అఘాయిత్యానికి గురైనా బాధను అనుభవించిన బాలిక.. ఉపాధ్యాయులపై మాత్రం ఎవరికీ నోరు విప్పి మాట చెప్పలేకపోయింది. ఈ క్రమంలో అమె గర్భందాల్చింది. దీంతో తమ ముసుగు తొలగిపోతుందని ఆందోళన చెందిన జగదీష్ యాదవ్, జగత్ సింగ్ గుర్జార్ లు స్థానికంగా ఆసుపత్రి నడుపుతున్న వైద్య దంపతులు రజ్నీష్ శర్మ, కానన్ లను సంప్రదించి భాదిత బాలికకు వైద్యం చేయాలని కోరారు.
అప్పనంగా డబ్బు వస్తున్నందున వారు కూడా నిందితులకు సహకరించారు. ఇలాంటి కేసుల్లో ముందుగా వారు పోలీసులకు సమాచారం అందించకుండా అబార్షన్ చేసేందుకు పూనుకున్నారు. బాధితురాలికి బలవంతంగా అబార్షన్ చేయడంతో అది వికటించి.. అమె అరోగ్యం విషమించింది. తమ బిడ్డ విషయంలో అందోళన చెందిన తల్లిదండ్రులకు విషయం తెలిసిపోగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాఠశాల డైరెక్టర్, లెక్చరర్, వైద్యులిద్దర్నీ అరెస్టు చేసిన పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. రేపిస్టులపై గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేయగా, నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేయడంపై వైద్య దంపతులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more