ఇండియన్ సాప్ట్ వేర్ కంపెనీల హబ్ గా పేరోందిన బెంగళూరును ఉగ్రవాదులు తమ టార్గెట్ గా చేసుకున్నారా..? అంటే అవునన్న సంకేతాలు వస్తున్నాయి. సాప్ట్ వేర్ రంగంలో అంచెలంచలుగా ఎదిగి.. అభివృద్దిలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఆ నగరాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేశారని... ఏ క్షణంలోనైనా దాడులు జరిపే అవకాశం ఉందని కేంద్ర నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో, బెంగళూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. విదేశీ రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించింది.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో పాటు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, బంగ్లాదేశ్ ఉగ్రవాదులు దేశంలోని వివిధ ప్రాంతాలను టార్గెట్ చేశాయని... దేశ రాజధాని ఢిల్లీ తర్వాత బెంగళూరు వారికి ప్రధాన టార్గెట్ గా ఉందని తెలిపింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అందిన వెంటనే... ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోలీసు ఉన్నతాధికారులతో కీలక భేటీ నిర్వహించారు. మరోవైపు, కర్ణాటకలో 283 మంది బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తున్నట్టు గత ఏడాది గుర్తించారు.
బెంగళూరులో స్విట్జర్లాండ్, శ్రీలంక, మాల్దీవులు, ఇటలీ, ఐర్లండ్, మంగోలియా, కెనడా, డెన్మార్క్, జపాన్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇథియోపియా తదితర దేశాలు కాన్సులేట్ జనరల్ కార్యాలయాలు ఉన్నాయి. వీటితో పాటు, అంతర్జాతీయ విమానాశ్రయం, లెక్కలేనన్ని బహుళ అంతస్తుల భవనాలున్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో ఆ రాష్ట్రం హోం మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు బెంగళూరు పోలీసులు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన ప్రదేశాల్లో చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more