రైలు ప్రమాదాలను తాను పూర్తి నైతిక బాధ్యత వహిస్తున్నానంటూ కేంద్రమంత్రి సురేష్ ప్రభు రాజీనామాకు సిద్దపడ్డారు. నాలుగు రోజుల వ్యవధిలో ఉత్తర్ ప్రదేశ్ లో వరుసగా రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు పట్టాలు తప్పడంలో ఈ ప్రమాదంలో 23 మృత్యువాత పడ్డగా, 156 మంది గాయాలపాలయ్యారు. అయితే నాలుగు రోజుల వ్యవధిలోనే ఈ రెండు ప్రమాదాలు జరగడంతో విపక్షాలు కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురష్ ప్రభు ను తన పదవికి రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేశాయి.
ఈ ప్రమాద ఘటనలకు తాను నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు కేంద్రమంత్రి సురేష్ ప్రభు రెడీ అయ్యారు. ఇవాళ ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలసి తాను రాజీనామా చేయాలని భావిస్తున్నానని కూడా చెప్పారని తెలుస్తుంది. ఈ మేరకు మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా రాజీనామాకు సిద్దపడ్డ సురేష్ ప్రభు తన రాజీనామా లేఖతో ప్రధాని వద్దకు వెళ్లి.. దానిని సమర్పించారని సమాచారం. ఈ క్రమంలో సురేష్ ప్రభు రైల్వే బోర్డు చైర్మన్ ఏకే మిట్టల్ బాటను ఫాలో అయ్యారని తెలుస్తుంది.
ఉత్తర్ ప్రదేశ్ లో గత నాలుగు రోజుల కిందట ప్రమాదానికి గురైన ఉత్కల్ ఎక్స్ ప్రెస్ తో పాటు ఇవాళ తెల్లవారు జామున జరిగిన ఖైఫియత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదాలకు తాను నైతిక బాధ్యత వహించి రైల్వే బోర్డు చైర్మన్ ఏకూ మిట్టల్ ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ప్రమాదాలు సంబవించడం దురదృష్టకరమని భావించిన ఆయన ఇవాళ ఉదయం కేంద్ర రైల్వేశాఖ మంత్రికి తన రాజీనామాను సమర్పించారని జాతీయ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. అయితే మిట్టల్ రాజీనామాను ఇంకా ఆమోదించని కేంద్రమంత్రి సురేష్ ప్రభు.. తన రాజీనామాను ప్రధానికి సమర్పించేందుకు వెళ్లారు.
ఆ తరువాత తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు రైళ్లు పట్టాలను తప్పడం దురదృష్టకరమని ఆయన అవేధన వ్యక్తం చేశారు. అయితే గత మూడేళ్లుగా తాను ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో రైల్వేశాఖ అభివృద్ది కోసం తన శాయశక్తులా ప్రయత్నించానని చెప్పారు. ఈ రెండు రైళ్ల ప్రమాదాలకు తాను నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని పేర్కోన్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ తనను వేచి చూడాల్సిందిగా కోరారని సురేష్ ప్రభు సోషల్ మీడియా ద్వారా చెప్పారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more