ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్పై సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న పతంజలి ఆయుర్వేద మాజీ సీఈవో ఎస్కే పత్ర రాందేవ్ పై తారాస్థాయిలో విమర్శలు చేశాడు. సేవ పేరుతో ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా వేధిస్తారంటూ పత్ర విరుచుకుపడ్డాడు.
రూ.10,500 కోట్ల టర్నోవర్కు చేరుకున్న పతంజలి కంపెనీలో ఉద్యోగులకు వేతనం అందడం లేదని, సేవ పేరుతో వారితో ఫ్రీగా పని చేయించుకుంటున్నాడని అంటున్నాడు పత్ర. అంతేకాదు ఇచ్చే జీతాలు కూడా చాలా తక్కువగా ఉంటాయని చెబుతున్నాడు. పైగా దానికి బాబాజీ (బాబా రాందేవ్) సేవగా పిలుస్తున్నారని వివరించారు. తాను సీఈవోగా ఉన్నప్పుడు పతంజలి ఆయుర్వేద, పతంజలి ఫుడ్పార్క్లో ఒకేసారి రెండు విధులు నిర్వర్తించానని పేర్కొన్నారు. రెండు ఉద్యోగాలకు వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని కానీ అలా జరగలేదన్నారు.
పతంజలి సేవ కోసమే పుట్టిందని, ప్రస్తుతం ఆయన వేతనం తీసుకుంటున్నా, తర్వాత అది ఉండదని చాలా ఓపెన్ గానే తనతో నిర్వాహకులు చెప్పేవాళ్లని తెలిపాడు. మరోవైపు పతంజలి ఉన్నది మానవ ‘సేవ’కోసమని అధికారిక వెబ్ సైట్ లో ఉన్న మాట పాత్ర వ్యాఖ్యలకు బలం చేకూరుస్తోంది. తనకు వేతనం ఆపడంపై పాత్రా పలుమార్లు బాబా రాందేవ్తో వాదనకు కూడా దిగారు. ‘‘నాకు వేతనం కావాలి. నా కోసం కాదు. నాకో కుటుంబం ఉంది. వారిని చూసుకోవాల్సిన బాధ్యత నాదే. అందుకోసమైనా నాకు జీతం కావాలి’’ అని చాలాసార్లు బాబాను కలిసి వేడుకున్నట్టు చెప్పారు. దీంతో ముందు హామీ ఇచ్చినట్టు కాకుండా ఒక ఉద్యోగానికి మాత్రమే వేతనం ఇచ్చి, ఫ్రీ గా సేవలు చేయాలంటూ ఆదేశించారని వాపోయాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more