మహా ఘటబంధన్ తో మైత్రి తెంచుకుని చివరకు మూడేళ్ల తర్వాత పాత దోస్తీ బీజేపీతో కలిసి బీహార్ లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది జనతాదళ్(యు). ఆరోసారి జేడీయూ నేత నితీశ్ కుమార్ కాసేపటి క్రితమే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాడు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ గవర్నర్ కేసరి నాథ్ త్రిపాఠి దగ్గరుండి మరీ ఈ కార్యక్రమం నిర్వహించాడు. మరోపక్క బీజేపీ నేత సుశీల్ కుమార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఆ వెంటనే శుక్రవారం అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ నితీశ్ ను ఆదేశించాడు.
బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 మంది సభ్యులున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 122. ఆర్జేడికి 80, జెడియుకు 71, కాంగ్రెస్కు 27 స్థానాలుండగా...బిజెపికి 53 స్థానాలు, ఇతరులకు 5 స్థానాలున్నాయి. అంటే బీజేపీ, జేడీయూ 124, ఇతరులతో కలుపుకుని మరో 5 మొత్తం 129 గా ఉంది. ఆర్జేడీ కాంగ్రెస్ బలం 107. ఈ నేపథ్యంలో గురువారం మొత్తం జరిగే పరిణామాలే కీలకం కానున్నాయి.
అంతకుముందు తేజస్వి యాదవ్ గవర్నర్ త్రిపాఠిని కలిసి, ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అనుమతించాలని కోరగా, ఇప్పటికే సంఖ్యాబలాన్ని చూపినందున ఆయన్ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించానని, అందువల్ల ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేనని త్రిపాఠి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, బల నిరూపణకు ఎక్కువ రోజులు గడువు ఇవ్వబోనని ఆయన చెప్పడంతో, ఇక చేసేదేమీ లేక తేజస్వి బయటకు వచ్చేశాడు.
నితీశ్ కు ఝలక్...
ప్రజలు ఓటేసిన మహా కూటమిని బద్దలు కొడుతూ, గతంలో తాను స్వయంగా తిరస్కరించిన బీజేపీ వైపు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అడుగులు వేయడాన్ని ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు అలీ అన్వర్ తీవ్రంగా విమర్శించారు. ఆయన అంతరాత్మ ఈ పని చేయమని చెప్పిందేమో కానీ, తన అంతరాత్మ మాత్రం ఇటువంటి నీచపు కార్యాన్ని ప్రోత్సహించడం లేదని నిప్పులు చెరిగారు. నితీశ్ రాజకీయాలకు తాను మద్దతు ఇవ్వలేనని స్పష్టం చేశాడు. జనతాదళ్ (యు)కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు సైతం, ప్రజాభిప్రాయాన్ని కాదనడం తమకు ఇష్టం లేదని బహిరంగంగానే చెబుతుండటంతో, వారిని బుజ్జగించే యత్నాల్లో నితీశ్ ఉన్నట్టు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more