పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను కట్టబెట్టడంపై అశ్చర్యం వ్యక్తం చేసిన రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు అటు ఆంధ్రప్రదేశ్ లోని నలుగురు మంత్రులతో పాటు ఇటు తెలంగాణలోని ఒక్క మంత్రికి నోటీసులను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వంలోకి వలసవెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడంపై దాఖలైన పిటీషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇవాళ వారికి షాక్ ఇచ్చింది.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడి అధికార పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేలు మంత్రులుగా కోనసాగుతున్న నేపథ్యంలో వారిని ఆ పదవుల నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. పార్టీ ఫిరాయించి మంత్రి పదవులు అనుభవించడం చట్ట విరుద్ధమంటూ జర్నలిస్ట్ శివప్రసాద్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ పై ఇవాళ న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. ఆర్టికల్ 164 (1బి) ప్రకారం పార్టీ మారిన వారిని మంత్రులుగా నియమించడం చట్టవిరుద్ధమని పిటిషన్ శివప్రసాద్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
దీనిపై నలుగురు మంత్రులకు హైకోర్టు నోటీసులు జారీ చేసి, నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే తెలంగాణలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసును కూడా ఇదే కేసుతో విచారణ చేస్తామని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. దీంతో వైసీపీ పార్టీ బీఫారమ్ పై గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్.అమరనాథ్రెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, రావు సుజయ్కృష్ణ రంగారావు, భూమా అఖిలప్రియలకు న్యాయస్థానం నోటీసులను జారీ చేసింది. వీరితో పాటు టీడీపీ పార్టీ తరపున గెలిచిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా నోటీసులు జారీ అయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more