తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన డ్రగ్స్ రాకెట్ కేసు చివరకు సొంత శాఖకు చెందిన అధికారుల మెడకే చుట్టుకుంది. ఈ కేసు దర్యాప్తు విషయంలో సీరియస్ గా వున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్.. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు అందే సమాచారం గొప్యంగా వుండాలని, నిందితులకు శిక్ష తప్పనిసరిగా పడాలని కృతనిశ్చయంతో వున్నారు. దీంతో ఇప్పటికే రంగంలోకి దిగిన పలు బేరగాళ్ల అంశం కూడా ఆయన దృష్టికి వచ్చింది.
డ్రగ్స్ కేసులు మీ పిల్లల పేర్లు వున్నాయని వాటిని ఆ జాబితా నుంచి తొలగిస్తామని కొందరు కేటుగాళ్లు సంపన్న కుటుంబాల పిల్లల తల్లిదండ్రుల వద్దకు చేరుతున్నారు. ఇక డ్రగ్స్ కేసు జాబితా నుంచి
పేర్లను తొలగించడానికి భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో అయన సమయం చూసి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక మరికోన్ని గంటల వ్యవధితో డ్రగ్స్ కేసులో దర్యాప్తు ప్రారంభం కానున్న నేపథ్యంలో సొంత శాఖ అధికారులకు జలక్ ఇచ్చారు.
ఇన్నాళ్లు డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతున్నా.. నిద్రావస్థులో వుండి పట్టించుకోకుండా వదిలేసిన అధికారులపై ఉక్కుపాదం మోసారు. డ్రగ్స్ మాఫియా ఏకంగా విద్యార్థులను టార్గెట్ చేసుకునేంత వరకు నిశ్చేష్టులై చూస్తున్న అధికారులపై వేటు వేశారు. ఒక్కసారిగా సొంత శాఖకు చెందిన 212 మంది అధికారులపై బదిలీ వేటు వేశారు. దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్నారన్న కారణాలతో ఈ బదిలీలు చోటుచేసుకున్నాయి. వీరిలో 20 మంది అసిస్టెంట్ సెక్రటరీలు, 192 మంది సీఐలు బదిలీ అయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more