సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీగా ఉద్యోగుల ఉద్వాసనకు నడుం బిగించనుంది. ఆటోమేషన్, వ్యాపారం మందగించడం తదితర కారణాలను చూపుతూ ఇటీవలె పలు కంపెనీలు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాయి. ఇన్ఫోసిస్ ఏకంగా 11 వేల మంది ఉద్వాసనకు సిద్ధమైపోయింది. దీంతో మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ కూడా అదే దారిలో పయనిస్తున్నట్టు తెలుస్తోంది. సంస్థ రీఆర్గనైజేషన్ లో భాగంగా సేల్స్ అండ్ మార్కెటింగ్ కార్యకలాపాలను పూర్తిగా సమీక్షించనున్నామని, ఫలితంగా ఫీల్డ్ సేల్స్ తదితర విభాగాల్లో వేలమందిని తొలగించాల్సి రావచ్చని సంస్థ అధికారి ఒకరు చెప్పడం ప్రకంపనలు సృష్టిస్తోంది.
వారి స్థానంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ప్లాట్ ఫాంలను వినియోగించాలని భావిస్తున్నట్లు పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ సీనియర్ అధికారి వెల్లడించాడు. మార్చి నాటికి సంస్థలో 1,21,567 మంది ఉద్యోగులు ఉన్నారని, వీరిలో సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాల్లోని వారిపైనే ఈ వేటు ఉండే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా, సోమవారం నాడు సంస్థ తన ఉద్యోగులకు ఓ లేఖను రాస్తూ, కమర్షియల్ సేల్స్ విభాగాన్ని రెండు సెగ్మెంట్లుగా విభజిస్తున్నట్టు పేర్కొంది. ఓ భాగం పెద్ద కస్టమర్లకు, మరో భాగం చిన్న, మధ్యతరహా కస్టమర్లకు సేవలందిస్తుందని, ఉద్యోగులను ఉత్పత్తి, ఆర్థిక సేవలు, రిటైల్, వైద్యం, విద్య, ప్రభుత్వాలకు సేవలు అంటూ ఆరు విభాగాలుగా విభజించామని పేర్కొంది.
సాఫ్ట్ వేర్ అమ్మకాలను నాలుగు విభాగాలుగా విభజించామని, మోడ్రన్ వర్క్ ప్లేస్, బిజినెస్ అప్లికేషన్స్, యాప్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ డేటా అండ్ ఏఐగా మార్చనున్నామని తెలిపింది. కాగా, మైక్రోసాఫ్ట్ సంస్థ ఇప్పటికే కస్టమర్లను ఆకర్షించే విషయంలో అమెజాన్, ఆల్ఫాబెట్ (గూగుల్) వంటి సంస్థలతో తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 2014 లో నోకియా స్మార్ట్ ఫోన్లు దారుణంగా విఫలమైన సందర్భంలో 18,000 మందిని, ఇతరత్రా కారణాలతో 2015 లో 7,800 మందిని, గతేడాది 4,700 మందిని సాగనంపింది. ఇక ఇప్పుడు మళ్లీ తొలగింపు వార్తతో ఎవరిపై వేటు పడుతుందో తెలీక ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more