ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత మూడేళ్లుగా కేంద్రం పునర్విభజన చట్టానికి లోబడి ఏలాంటి కార్యక్రమాలు చేయలేదని, మరి రానున్న రెండేళ్లలో రాష్ట్ర ప్రజల అశలను ఎలా నేరవేరుస్తారని ఆయన ప్రశ్నించారు. కేంద్రం 16 వేల కోట్ల రూపాయల అర్థిక సహకారాన్ని రాష్ట్రానికి అందించాల్సి వుండగా, కేవలం 7 వేల కోట్ల రూపాయలను మాత్రమే ఇచ్చిందని ఆయన తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వైసీపీ అధినేత జగన్ కలిసిన విషయంపై టీడీపీ నేతలు రాద్ధాంతం చేయడం వెనుక వారికి ఏదో భయం పట్టుకున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు.. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని అరెస్టు చేయిస్తామన్నారని పేర్కొన్నారు. గతంలో గోద్రా అల్లర్లు జరిగిన అనంతరం మోదీ దేశ పర్యటన చేస్తున్నప్పుడు, ఆయన హైదరాబాద్కు వస్తే అరెస్ట్ చేస్తామని 2003 ఆగస్టు 27న చంద్రబాబు ప్రకటించారని ఉండవల్లి చెప్పారు.
అదే విషయాన్ని ప్రధాని మోదీ ఇప్పుడు కూడా మనసులో పెట్టుకున్నారేమోనని చంద్రబాబు ఆందోళన చెందుతున్నట్లు తనకు అనిపిస్తోందని ఉండవల్లి అన్నారు. అవినీతి, ఓటుకు నోట్లు వంటి కేసుల నేపథ్యంలో మోదీ తనపై చర్యలు తీసుకుంటారేమోనని తనను అరెస్టు చేయిస్తారేమోనన్న అందోళన చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల్లో స్పష్టమవతుందని అన్నారు. రానున్న కాలంలో మోదీ, జగన్ కలిసి ముందుకు వెళతారేమోనని టీడీపీ నేతలు ఆందోళన చెందుతూ జగన్ పై విమర్శలు చేస్తున్నారని ఉండవల్లి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more