అన్నింటికి ఆధార్ తో లింకులు పెట్టి అత్యున్నత న్యాయస్థానం ముందు ప్రభుత్వం దోషిగా నిలబడి వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తోంది.భద్రతా రీత్యా పలు బ్యాంక్ అకౌంట్లు, వ్యక్తిగత సమాచారం లీక్ అయిన నేపథ్యంలో పలు పశ్నలు సంధించిన విషయం తెలిసిందే. అయితే తమ తరపున ఎలాంటి తప్పులు లేవని, కేవలం ప్రభుత్వ కార్యాలయాల నుంచి మాత్రమే ఆ డేటా చోరీ జరిగిందని యూఐడీఏ క్లారిటీ ఇచ్చింది.ఇదిలా ఉంటే ఆధార్ లోని డొల్లతనం మరోసారి బయటపెట్టే ఘటన యూపీలో చోటు చేసుకుంది.
అలహాబాద్ సమీపంలోని కంజాసా గ్రామం అది.పాఠశాలల్లో చదువుకుంటున్న అందరు విద్యార్థుల ఆధార్ కార్డు వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని యోగి సర్కార్ ఈ మధ్యే ఆదేశాలు జారీ చేసింది. దీంతో పిల్లలంతా తమ తమ ఆధార్కార్డుల జిరాక్సులను ఇవ్వగా,అవి పరిశీలించిన టీచర్లకు పెద్ద షాకే కొట్టింది. ఎందుకంటారా? పిల్లలందరి పుట్టిన తేదీ జనవరి 1గాఉంది. ఒక్క విద్యార్థులదే కాదు ఆ గ్రామంలో 10,000 మంది ప్రజల ఆధార్ కార్డులలో ఇదే తేదీ నమోదైంది.
దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయగా తప్పు దొర్లిందని ఒప్పేసుకున్న గ్రామాధికారి రామ్ దులారి తిరిగి కొత్త కార్డులు ఇష్యూ చేసేందుకు సిద్ధమైపోయాడు.
మనుషులతోపాటే జంతువులు కూడా...
పట్టణీకరణ పేరిట మనిషి ఒక్క ప్రకృతికే కాదు సమస్త జీవరాశికి కూడా హని చేస్తున్నాడు. తమ నివాసాలు కనుమరుగు అయిపోతుండటం, ఆకలి దప్పికలు వెరసి మూగజీవులు సమీపంలోని గ్రామాలపై ఎగబడిపోతున్నాయి. తరచూ ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ, మహారాష్ట్ర నాసిక్ సమీపంలోని మాందాపూర్ గ్రామం మాత్రం చాలా ప్రత్యేకం. ఇక్కడ మనుషులతో సమానంగా మూగజీవాలు కూడా నివసిస్తుంటాయి.
ముఖ్యంగా దుప్పులు ఇక్కడ గ్రామస్తులతోపాటే కలియ తిరగటం విశేషంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా వాటికి భయం, సిగ్గు ఎక్కువ. అలాంటిది మనుషుల మధ్య ఇలా నివసించటం ఆశ్చర్యం కలిగించేదే అయినా తరతరాల నుంచి అవి అలా కలిసిపోయాయని సామాజిక వేత్త ప్రకాశ్ గుద్గే చెబుతున్నాడు. తమకు దొరికిన స్వేచ్ఛను అనుభవిస్తూనే గ్రామస్థులను ఇబ్బంది పెట్టకుండా వారు అందించే ఆహారాన్ని ఇవి స్వీకరిస్తుంటాయంట. రాను రాను పర్యాటక రంగానికి ఈ గ్రామం ఎంతో ప్రసిద్ధి అవుతుండటంతో మరిన్ని సౌకర్యాలను కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more