తెలుగు రాష్ట్రాల్లో మీడియా పక్షపాత ధోరణులు కొనసాగటం కొత్తేం కాదు. ఓపార్టీకి ఓ పేపర్, మరో పార్టీకి మరో పేపర్ ఇలా మీడియాను మ్యానేజ్ చేస్తూ సాగే రాజకీయాలు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. ఒక్కోసారి వాట్లో విమర్శలు శృతి మించిపోవటం, యెల్లో మీడియా అంటూ ఇరు పక్షాలు దుమ్మెత్తిపోసుకోవటం చూస్తుంటాం. ఆ మధ్య తనపై లేనిపోని కథనాలు రాస్తుందన్న కోపంతో ఏకంగా ఆ పత్రిక ప్రతినిధులను మీడియా సమావేశాలకు కూడా అనుమతించలేదు ఏపీ సీఎం చంద్రబాబు.
ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కూడా దాదాపు అలాంటి పనే చేస్తోంది. తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేక కథనాలు ప్రచురిస్తుందని ఆరోపిస్తూ ఆంధ్రజ్యోతి పత్రికను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఈ మేరకు ఓ ప్రకటన కూడా చేశాడు. టీడీపీ జెండాను భుజాన మోస్తూ... తప్పుడు వార్తలను ప్రచురిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రజా సమస్యల గురించే ప్రధాని మోదీతో జగన్ భేటీ అయితే వినతి పత్రంలో వ్యక్తిగత ప్రయోజనాలంటూ లేనిపోని కథలు రాసిందని మండిపడ్డాడు.
పత్రికా విలువలను ఆంధ్రజ్యోతి పూర్తిగా వదిలేసిందని అన్నారు. జగన్ ప్రతిష్టను దిగజార్చేలా తప్పుడు వార్త రాసిన జ్యోతిపై ప్రెస్ కౌన్సిల్ కు లేఖ రాస్తామని చెప్పారు. పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు. గత మూడేళ్లుగా జగన్ పై ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలు విషం కక్కుతున్నాయని అన్నారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పత్రికను గ్రామ స్థాయి నుంచి అన్ని స్థాయుల వరకు వైసీపీ బహిష్కరిస్తోందని భూమన తెలిపారు. తమ పార్టీ కార్యాలయాలకు కూడా ఆ పార్టీ విలేకరులు రావాల్సిన అవసరం లేదని చెబుతూ బ్యాన్ ను ప్రకటించింది వైఎస్సార్సీపీ.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more