ప్రమాదంలో చిక్కుకున్న మహిళను సజీవంగా కాపాడటంతో తెగువను ప్రదర్శించిన అనీల్ వన్నవల్లి పేరు అటు అమెరికా ఇటు భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ధ్వనిస్తుంది. అయన ధైర్యసాహసాలను ప్రశంసిస్తుంది. ఈ నేపథ్యంలో తాను దోపిడికి గురికావడంపై స్పందించిన ఎడిసన్ పోలీసులు అనీల్ వన్నెవల్లికి వెయ్యి డాలర్ల పారితోషకాన్ని అందించారు. అనీల్ ప్రదర్శించిన ధైర్యసాహం కారణంగా బాధితురాలు కేవలం గాయాలతో బయటపడిందని, అలా కాని పక్షంలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా విషాదకరంగా వుండేవని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వార్త వివరాల్లోకి వెళితే..
అనిల్ వన్నవల్లి (34) అనే భారతీయుడు న్యూయార్క్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. మాన్ హట్టన్ లోని తన కార్యాలయానికి వెళ్లేందుకుగానూ ఎడిసన్ స్టేషన్ కు వెళ్లాడు. అనిల్ తోపాటే తన కార్యాలయంలో పనిచేసే మాధురి రేచర్ల అనే యువతి కూడా అదే సమయంలో ఎడిసన్ స్టేషన్ కు వచ్చింది. రైలు వస్తున్న క్రమంలో అకస్మాత్తుగా మాధురి సృహకోల్పోయి.. రైలు పట్టాలపై పడిపోయింది. ఇది గమనించిన అనిల్.. తన భుజానికున్న బ్యాగును ఫ్లాట్ ఫాంపై పెట్టి, ఆమెను కాపాడేందుకు పట్టాలపైకి దూకి అమెను తన చేతుల్లోకి తీసుకుని పక్కకు తీసుకువచ్చాడు. ఆ తరువాత రైలు రావడం.. వెళ్లిపోవడం జరిగింది. ఇది గమనించిన మరికోందరు యువకులు అనీల్ కు సాయపడ్డారు.
గడచిన రెండు రోజులుగా అహారం తీసుకోకపోవడంతో తాను సృహకోల్పోయానని అప్పటికే అక్కడకు చేరుకున్న ఎడిసన్ పోలీసులకు మాధురి తెలిపింది. అయితే రైలు పట్టాలపై పడటంతో అమె మోకాలు, మడమల్లో ప్రాక్చర్ కావడంతో. అమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు పోలీసులు. ఇదిలావుండగా, సందెట్లో సడేమియాలా.. అమెరికాలో అదీ ఓ యువతి ప్రాణాలను కాపాడేందుకు సాహసం చేసిన అనీల్ బ్యాగ్ ను అక్కడి చోరులు తస్కరించారు. అందులో విలువైన ల్యాప్ టాప్, కొంత డబ్బు, ఐడీ కార్డులు ఉన్నాయి. దీంతో పోలీసుల గోఫండ్ మీ పేజీని తెరవడంతో పాటు అనీల్ తెగువకు మెచ్చి.. వెయ్యి డాలర్ల పురస్కారాన్ని అందించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more