ప్రముఖ డిజిటల్ వ్యాలెట్ పేటీఎం అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని బంగారం కొనేందుకు అచ్చంగా కుందనం లాంటి పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. మరీ ముఖ్యంగా కనీసం మూడు వేల రూపాయలు వుంటే తప్ప ఒక గ్రాము బంగారాన్ని కొనలేమని చెప్పే దుకాణాదారులను కాదని ఏకంగా మధ్యతరగతి, సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని అద్బుతమైన ఆపర్ ను తీసుకువచ్చింది. అక్షయ తృతీయను పురస్కరించుకుని ‘డిజిటల్ గోల్డ్’ వ్యాలెట్ను ప్రారంభించింది.
ఈ ఆఫర్ ద్వారా 999.9 స్వచ్ఛత గల 24 క్యారెట్ల బంగారాన్ని రూపాయి అంతకంటే తక్కువ మొత్తంలో కూడా కొనుగోలు చేసుకోవచ్చు. కొనుగోలు చేసిన పసిడిని ‘డిజిటల్ గోల్డ్’ వ్యాలెట్లో దాచుకోవచ్చు. ఇక బంగారంతో వ్యాపారమంటే తెలియని వర్గాలను కూడా ఇకపై బంగారంలో తమ ఇష్టానుసారంగా పెట్టుబడులు పెట్టించి ఆ తరువాత వారిని క్రమంగా వ్యాపారం చేయడం దిశగా కూడా మల్లించేందుకు ఈ పథకం దోహదపడుతుంది. పేటియం డిజిటల్ వ్యాలెట్ లో దాచుకున్న బంగారాన్ని వారి అవకాశాలకు అనుగూణంగా మర్చుకునే వెసలుబాటు కల్పించింది పేటీయం.
బంగారాన్ని కావాలనుకున్నప్పుడు దానిని ఇంటికి డెలివరీ చేయమని అర్డర్ ఇవ్వడం చేయవచ్చు.. లేదు తాము పెట్టిన పెట్టుబడికి అధికమొత్తం వస్తుందంటే దానిని ఆన్లైన్లో విక్రయించుకోవచ్చు. ఇలా మధ్యతరగతి వారిని కూడా బంగారంలో పెట్టుబడులు పెట్టే దిశగా చేస్తుంది పేటీయం. ఎంఎంటీసీ-పీఏఎంపీ సంయుక్తంగా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఎవరికి తగ్గ స్థాయిలో వారు బంగారం కొనుగోలు చేసుకునేందుకు, బంగారంలో డిజిటల్ గోల్డ్ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు ఇదో సులభమైన మార్గంగా మారనుంది. కాగా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన బంగారాన్ని వినియోగదారులు కావాలనుకున్నట్టు నాణేల రూపంలో వారి ఇంటికి డెలివరీ చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more