ఏదైనా సరిగ్గా చెబితే పట్టించుకుంటారా? తేడాగా చెబితేనే వింటారు? మనమూ పాపులర్ అవుతాం... అని ఆ మధ్య ఓ నేత తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హీరో అయిపోవటం చూశాం. అయితే తేడా మాటలే కాదు.. చేష్టలు కూడా అందుకు మినహాయింపు ఏం కాదు. వేద మంత్రాలు, పచ్చని పందిళ్లు.. శాస్త్రోస్తంగా చేసుకోవాల్సిన ఓ పెళ్లిని ఇక్కడో జంట ఎలా చేసుకుందో చూస్తే మీరే షాకవుతారు. అదేంటో తెలుసుకోవాలంటే మహారాష్ట్ర జాల్నా జిల్లా పరతూర్కి వెళ్లాల్సిందే.
మసన్జోగి వర్గానికి చెందిన సుభాష్ గైక్వాడ్ తన కూతురి పెళ్లిని ఘనంగా చేయాలనుకున్నాడు. అదే వర్గానికి చెందిన సాహెబ్రావ్ కుమారుడు ఆకాష్ పెళ్లి కొడుకు. అయితే వీళ్ల పెళ్లి ఘనంగా కాకుండా కాస్త వైవిధ్యంగా చేయాలని వాళ్ల తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. మసన్జోగి వర్గం వాళ్ల వృత్తి కాటికాపరిగా ఉండటం. అందుకే వీళ్ల పెళ్లి కూడా శ్మశానంలోనే చేయాలని ఇరువైపుల తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. దానికి బాగా చుదువుకున్న వాళ్లు కావటంతో మంజుశ్రీ, ఆకాష్లు అడ్డుచెప్పలేదు కూడా.
ఇక ఓ వివాహ వేడుకకి హాజరుకావడానికి అందరూ శ్మశానంలోకి వెళ్లారు. వీరి వివాహం కోసం వైకుంఠధామ్ శ్మశానవాటికను ప్రత్యేకంగా అలంకరించి, అంత్యక్రియలు నిర్వహించకముందు శవాలను ఉంచే స్థలంలోనే పెళ్లిమండపాన్ని ఏర్పాటు చేసి మరీ పెళ్లి జరిపించారు. అక్కడ ఒక్కటవుతున్న జంటను చూసి అంతా ముందు ఆశ్చర్యపోయి, ఆపై అభినందించారు. ఇంతకీ దీనివల్ల ఒరిగింది ఏంటంటారా? ఓ సందేశాన్ని ఇవ్వడానికే తాము ఇలా శ్మశానం సాక్షిగా పెళ్లి చేశామని పెద్దలు, నూతన వధువరులు చెబుతున్నారు. తమ కర్మభూమిని మరవద్దనే సందేశంతో పాటు కట్నకానుకలు, ఆడంబరాలకు దూరంగా ఉండాలని, మూఢనమ్మకాలపై అవగాహన పెంచుకొని వాటిని తరిమేయాలని వారు పిలుపునిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more