కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో హైలెట్ అయిన వ్యక్తి లగడపాటి రాజగోపాల్ మళ్లీ వార్తల్లో నిలిచారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సన్యాసం పేరిట అజ్నాతంలో ఉన్న ఆయన ఆ మధ్య మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు తెగ ప్రయత్నించారు. బీజేపీలో చేరతారన్న ఊహగానాల నడుమ ఆయన పోస్టర్లు కూడా వెలిశాయి, ఆపై వైసీపీ అంటూ వార్తలు రావటంతో చర్చకు దారితీశాయి. అయితే తాను ఎందులోనూ చేరబోనని ఆ సమయంలో ఓ ప్రకటన ఇచ్చుకున్నాడు కూడా. అయితే శుక్రవారం జరిగిన పరిణామాలను చూస్తుంటే ఆయన రీఎంట్రీ తెలుగుదేశంతో ఉంటుందా అన్న డౌట్లు మొదలౌతున్నాయి.
ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే లగడపాటి భేటీ కావటం విశేషం. వెలగపూడిలోని సచివాలయం సీఎం కార్యాలయంలో వీరిద్దరూ దాదాపు 40 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. దీంతో లోపల ఏం జరిగిందా అన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తన రాజకీయ భవిష్యత్తు కోసం ట్రావెల్స్ ను ఎంపీ కేశినేని నాని మూసేయటం తెలిసిందే. అయితే ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పట్ల నాని ప్రవర్తించిన తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహాంతో ఉన్నాడు.
ఈ క్రమంలో ఆయనను దూరం పెట్టే, లగడపాటికి క్లోజ్ అవుతున్నాడేమోనని చర్చించుకుంటున్నారు.అదే నిజమైతే 2019 ఎన్నికల్లో కేశినేని ప్లేస్ లో లగడపాటికి చంద్రబాబు ఎంపీ టికెట్ ఖాయమనే చెప్పుకోవాలి. కానీ,మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన లగడపాటి కేవలం రాజకీయ భేటీ కాదని చెబుతూనే చంద్రబాబుపై పొగడ్తలు కురిపించాడు. తాత్కాలిక సచివాలయమే ఇంత అద్భుతంగా ఉంటే... శాశ్వత భవనాలు ఇంకెంత అద్బుతంగా ఉంటాయో అంటూ వ్యాఖ్యలు చేశాడు. మొత్తానికి విజయవాడ రాజకీయాల్లో వేడిని పెంచిన ఈ భేటీ తర్వాత ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more