అగ్రరాజ్యంలో చంటిపిల్లల పెంపకం కూడా వార్తగానే నిలుస్తుంది. అందుకు నిండా 18 మాసాలు కూడా నిండిన ఈ చిన్నారి సంఘటనే తార్కణంగా చెప్పవచ్చు. తల్లికి వున్న ప్రాధాన్యత, భాధ్యతల విషయంలో అక్కడి వారు ఎంతటి విపరీతాలకు వెళ్తున్నారన్న విషయాలకు దర్ఫణం పడుతుంది. తల్లిదండ్రులు వారి జీవనాలే ముఖ్యమని మత్తులో జోగుతున్నారన్న విషయాన్ని ఈ సంఘటన రుజువు చేస్తుంది. తాను ఓ బిడ్డకు తల్లిన విషయాన్ని మర్చిపోయిన తల్లి వల్ల ఆ చిన్నారికి ఎదురైన పరిస్థితితో వారు ఇప్పుడు పోలీసల కేసులను ఎదుర్కొంటున్నారు.
తల్లిదండ్రుల నేరం రుజువైతే వారికి ఏకంగా మూడేళ్ల కారగారవాసం పడుతుంది. ఇక అప్పడు ఆ చిన్నారి ఆలనపాటన ఎవరు చూస్తారు. అన్నది కూడా మరో ప్రశ్నగా మారుతుంది. ఇంతకీ ఏం జరిగింది..? చిన్నారి, వారి తల్లిదండ్రులు ఏం చేశారన్న వివర్లాలోకి వెళ్తే.. సరిగ్గా రాత్రి 12 గంటలు. అంతా చీకటిగా వుంది.. వీదులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆ సమయంలో ఓ చిన్నారి ఇంటి నుంచి బయటకు వచ్చింది. వీధి దీపాల వెలుతురులో.. రోడ్డుపై అటూ ఇటూ తూలుతూ మత్తులో వున్నవారిలా నడవసాగింది. అమెను ఓ మానసిక వికలాంగుడు గుర్తించాడు. తాను పాపవద్దకు వెళ్దామనుకున్నా అతనికి ధైర్యం చాలలేదు. దీంతో పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికే చిన్నారిని తన తండ్రి, మరోవ్యక్తి హాస్పిటల్కి తరలించారు. అయితే అసుపత్రికి వెళ్తే తమ గుట్టు బయటపడుతుదని భావించిన చిన్నారి త్లండ్రి ముందుగా అంగీకరించలేదు. అయితే చిన్నారి పరిస్థితిని చూసిన తరువాత ఏం జరిగినా ఫర్వాలేదని అసుపత్రికి తీసుకుళ్లాడు. రంగంలోకి దిగన పోలీసులు ఘటనపై విచారణ జరిపి నిజాలు తెలుసుకుని దిగ్భ్రాంతి చెందారు. బాలికకు హెరాయిన్ డ్రగ్ ఎక్కువ కావడం వల్ల మత్తు ఎక్కిందని, నిద్రపట్టకపోవడంతో రోడ్డుపైకి వచ్చిందని, మత్తుతోనే రోడ్డుపై చాలా దూరం అమాయకంగా నడిచిందని పోలీసులు చెప్పారు.
బాలిక రోడ్డు మీదకు వచ్చిన సమయంలో తల్లికి స్పృహలేదని, డ్రగ్స్ అధికంగా తీసుకోవడం వల్ల మత్తులో ఉందని, ఘటన తరువాత వెళ్లి చూసినా అమె ఇంకా మత్తులోనే వుందన్నారు. కాగా చిన్నారి పరిస్థితి మాత్రం కొంత విషమంగానే వున్నా నిలకడగా వుందని, అమెకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో వుంచిన వైద్యలు చికిత్సనందిస్తున్నారిని కూడా చెప్పారు. చిన్నారి ప్రాణాలకు అపాయం కలిగేలా ప్రవర్తించినందుకు తల్లితండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే తల్లిదండ్రులిద్దరికీ సుమారుగా మూడేళ్లు కారాగారవాస శిక్ష పడే అవకావఆలు వున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more