అగ్రరాజ్యంలో జాత్యాహాంకారాలు పెల్లుబిక్కి మనదేశా పౌరులపై మానప్రాణాలకు రక్షణ విషయంలో అందోళన రేకెత్తుతున్న తరుణంలో అదే తరహా అహంకారాలు తాజాగా జర్మనీకి కూడా పాకాయి. జర్మనీలోని ప్రాంక్ పర్డ్ విమానాశ్రయంలో ప్రవాస భారతీయురాలు శ్రుతి బసప్ప (30)కు తీవ్ర అవమానం జరిగింది. ఐస్ లాండ్ జాతీయుడిని వివాహమాడిన ఆమె ఆరేళ్లుగా అక్కడే ఉంటున్నారు. గత నెల 29న శ్రుతి భర్తతో కలిసి జర్మనీ మీదుగా భారత్ వస్తున్నప్పుడు ప్రాంక్ పర్డ్ విమానాశ్రయంలోని సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ఘోరంగా అవమానించారు.
ఇప్పటికే ఎయిర్ పోర్టులో ప్రిక్సింగ్ లపై అనేక అరోపణలు వస్తున్న తరుణంలో భారతీయులే లక్ష్యంగా ఈ దారుణాలు జరుగుతున్నాయి. ప్రవాసభారతీయురాలి విషయంలోనూ అదే జరిగింది. శ్రుతి బసప్పను ప్రాంక్ పర్డ్ విమానాశ్రయ సిబ్బంది ప్రిక్సింగ్ పేరుతో ఘోరంగా అవమానించారు, పూర్తిగా దుస్తులు విప్పేయమని అడిగారు. అయితే రెండు వారాల క్రితమే తనకు పొత్తికడుపు ఆపరేషన్ కావడంతో ‘ప్యాంట్ డౌన్ చెక్’ జాగ్రత్తగా చేయాలని సెక్యూరిటీ సిబ్బందిని శ్రుతి కోరారు. ఆపరేషన్ పత్రాలు చూపించబోతుంటే నిరాకరించిన సిబ్బంది దుస్తులు విప్పేసి చూపించాలని అడగడంతో ఆమె హతాశురాలైంది.
దీంతో తన భర్త ఎదుటే తనను చెక్ చేయాలని డిమాండ్ చేయడంతో ఆయనను పిలిపించారని, ఆయన యూరోపియన్ అని తెలియడంతో నిబంధనలు ఒక్కసారిగా మారిపోయాయని శ్రుతి తెలిపారు. ప్యాంట్ డౌన్ చెక్ సరిపోతుందని చెప్పి పంపించారని పేర్కొన్నారు. తన శరీరం రంగు కారణంగానే విమాన సిబ్బంది తరచూ తనను ‘ర్యాండమ్ చెక్’కు ఎంచుకుంటున్నారని శ్రుతి ఆరోపించారు. యూరోపియన్లను బాడీ స్కానింగ్ చేసి వదిలేస్తే తనను వళ్లంతా తడిమి (ప్యాంట్ డౌన్ చెక్) చేసేవారని తెలిపారు. సిబ్బంది తీరు జాతివివక్ష కిందకు వస్తుందంటూ విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని శ్రుతి ఆవేదన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more