ఆంద్రప్రదేశ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పక్షానికి గట్టి దెబ్బే పడింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో మూడింటికి మూడు గెలుచుకున్న తెదేపా వీటిలో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో 3 పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు గానూ అధికార పార్టీని తిరస్కారం ఎదురుకాగా, మిత్రపక్ష సహకారంతో ఒకదానిని కైవసం చేసుకోగలిగింది.
సుమారు రెండు రోజుల పాటు జరిగిన లెక్కింపులో మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో(గ్రాడ్యుయేట్స్) ఒకటి వైఎస్సార్సీపీ, ఒకటి వామపక్షాలు, మరోకటి భాజాపా-తెదేపా కూటమి విజయం సాధించాయి. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డిపై వైసీపీ అభ్యర్థి వీ గోపాల్రెడ్డి 14,146 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఇక ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోవైసీపీకి చెందిన అజాశర్మపై బీజేపీ-టీడీపీ అభ్యర్థి పీవీఎన్ మాధవన్ 9251 ఓట్లతో జయ కేతనం ఎగరవేశాడు.
తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి వామపక్షాల అభ్యర్ధి శ్రీనివాసులురెడ్డి విజయం సాధించటం విశేషం. అనుహ్య పరిణామాల మధ్య ఆయన గెలుపు ప్రత్యేకంగా మారింది. తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి పట్టాభిరామిరెడ్డిపై 3,800 ఓట్ల తేడాతో గెలిచారు.
ఇక రెండు రోజుల వచ్చిన టీచర్ ఎమ్మెల్సీ ఫలితాల్లో తూర్పు రాయలసీమ, (చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం), పశ్చిమ రాయలసీమ (అనంతపురం, కడప, కర్నూలు) శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల్లో టీడీపీకి చుక్కెదురైందన్నది తెలిసిందే. తూర్పు రాయలసీమలో పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం 3,553 ఓట్ల ఆధిక్యతతో ఘన విజయం సాధించగా, పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం నుంచి ఎస్టీయూ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి విజయం సాధించారు. మొత్తానికి ఈ ఫలితాలతో మాత్రం అధికార తెలుగుదేశం పార్టీకి ఊహంచని విధంగా షాక్ తగలింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more