శ్రీచైతన్య ఇంటర్ విద్యార్థులు వీరంగం సృష్టించారు. ఏకంగా చదువు చెప్పే గురువులపైన దాడులకు తెగబడ్డారు. ప్రిన్సిపాల్, లెక్చరర్లుతో పాటు సెక్యురిటీ గార్డును చితకబాదారు. అర్థరాత్రి విద్యార్ధులు సృష్టించిన అలజడితో కాలేజీకి మాత్రమే పరిమితం కాకుండా.. కాలేజీ ఎదురుగా వున్న రోడ్డుపై వెళ్లే వాహనాలపై కూడా వారు విరుచుకుపడ్డారు. విద్యార్థుల దాడిలో రోడ్డుపై వెళుతున్న బస్సు కూడా ధ్వంసం అయ్యింది. విద్యార్థులకు అడ్డూఅదుపు లేకుండా వీరంగం చేయడమే కాకుండా దాడిని అడ్డుకోవాలని చూసిన కానిస్టేబుల్ పై కూడా దాడికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలుకాగా, అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరిగినా వారిని వారిళ్లకు పంపేందుకు యాజమాన్యం నిరాకరించింది. ఎంసెట్, సహా ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు విద్యార్థులను ప్రిపేర్ చేసేందుకు తరగతులను నిర్వహిస్తున్నారు. అయితే పరీక్షలు జరిగినా విద్యార్థులను తమ ఇళ్లకు పంపకపోవడంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు కాలేజీలో ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లను ధ్వంసం చేశారు. ఇలాంటి దారుణాలకు పాల్పడటంపై నిలదీసిన ప్రిన్సిపాల్, లెక్చరర్లపై కూడా దాడులకు దిగారు, అడ్డువచ్చిన సెక్యూరిటీని కూడా చితకబాదారు, అంతటితో అగకుండా కాలేజ్ బయటకు వచ్చి రోడ్డుపై వెళ్తున్న వాహానాలపై కూడా తమ ప్రతాపం చూపారు.,
అటుగా వెళ్తున్న బీట్ పోలీసులు వెళ్లి విద్యార్ధులను అడ్డుకోబోగా కానిస్టేబుల్ అని కూడా చూడకుండా దాడికి పాల్పడ్డారు, దీంతో సమాచారం అందుకున్న పోలీసుల పెద్ద సంఖయలో కాలేజీ వద్దకు చేరుకున్నారు. విద్యార్థులను వారి హాస్టల్ లోనికి పంపించి.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ దాడిలో ప్రిన్సిపాల్ సహా లెక్చరర్లుకు కూడా గాయాలయ్యాయి. అయితే ఇంత జరిగినా కాలేజీ యాజమాన్యం మాత్రం విద్యార్థులను వెనకేసుకువచ్చింది. పరీక్షలు అయిపోయిన ఆనందంలో విద్యార్థులు ఇలా ప్రవర్తించారని, ఎవరినీ గాయపరచలేదని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more