బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటమే తనకు కోట్ల ఆస్తితో సమానమన్న పవన్ తెలుగు రాష్టర్ ప్రభుత్వాలు చేనేతకు అండగా ఉంటానని మాటల్లో చెప్పటం కాదని, ఆచరించి చూపాలంటూ చెప్పాడు. నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై మోనటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ సంఘాలు నిష్పాక్షికంగా ప్రభుత్వాలు తమకు ఏం చేశాయో చెప్పాలని సూచించారు. చీర నేసే కష్టాన్ని తాను ఇప్పుడే చూశానని, అద్భుతమైన ప్రతిభ దాగి ఉన్న చేనేతను ప్రోత్సహించాలని ఆయన చెప్పారు. ఈ మేరకు నగదు బహుమతులు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
చేనేత వాడుతున్నందుకు తాను గర్వంగా ఫీలవుతున్నానన్న వపన్ వారంలో ప్రతీ ఒక్కరూ చేనేత ధరించాలని మరోసారి పిలుపునిచ్చాడు. రాజకీయాలంటే మురికి కుంపలు అంటూ కొందరు తనను ఎందుకు వచ్చావయ్యా అంటూ ప్రశ్నించారని, కానీ, లోపల నిర్మలంగా ఉన్న తాను మురికిలోకి వెళ్లినా స్వచ్ఛంగా బయటికి రాగలనంటూ చెప్పుకొచ్చాడు. చేత కానప్పుడు హామీలు ఇవ్వటం సరికాదన్న వపన్ మరోసారి ప్రత్యేక హోదాపై గళం విప్పాడు. ముందు స్టేటస్ తర్వాత ప్రత్యేక ప్యాకేజీ అని మాట మార్చాల్సిన అవసరం ఏమోచ్చిందని కేంద్రాన్ని ప్రశ్నించాడు.
2019 ఎన్నికల్లో జనసేన ఖచ్ఛితంగా పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్, తాను కూడా బరిలో నిలవనున్నట్లు మరోసారి స్పష్టం చేశాడు. అంతేకాదు గెలిచాక అసెంబ్లీలో చేనేత తరపున గొంతుక వినిపిస్తానని పవన్ ప్రకటించటం విశేషం. ఇక ప్రజలు చిత్తశుద్ధి కలిగిన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, పలువురు నేతలు తనతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, కష్టాలకు నెవరని నేతల కోసం తాను చూస్తున్నట్లు తెలిపాడు. ఇక ఎర్ర తుండువాను ధరించిన పవన్ ఇది సినిమాకు సంబంధించింది కాదని, కుల, వర్ణ, మత, బేధాలకు సంబంధం లేకుండా దీనిని ధరిస్తారంటూ తెలిపాడు. చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న జనసేన అధినేత చేనేత కార్పోరేషన్ ఏర్పాటు డిమాండ్ ను బలంగా వినిపించాడు.
తాను కేవలం చేనేత కార్మికులకే కాదని, స్వర్ణ కారులకు కూడా అండగా ఉంటానంటూ ప్రకటించాడు. అన్ని రంగాల వారిని ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని, గ్రాంట్స్ కోరాలంటూ డిమాండ్లు తమ ముందుకు వచ్చాయని, మార్చి 14న జనసేన వెబ్ సైట్ ను ప్రారంభిచబోతున్నామని తెలిపిన పవన్, వాటిని పరిశీలించి జనసేన భవిష్యత్ పోరాటం నిర్ణయిస్తుందని చెబుతూ భారత్ మాతాకీ జై, జై హింద్ నినాదాలతో ప్రసంగం ముగించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more