కోర్టులను ఖాతరు చేయకుండా తన నిర్ణయాలపైనే మొండిగా ముందుకు వెళ్తు పాలనపై పట్టుసాధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిసైడ్ అయ్యాడు. ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించి విమర్శలు కొని తెచ్చుకున్న ట్రంప్ మరోమారు అటువంటి ఉత్వర్వుల జారీకి సిద్ధమవుతున్నారు. పాత ఉత్వర్వుల్లో స్వల్ప మార్పులు చేసి కొత్తగా ఆదేశాలు జారీ చేయనున్నట్టు ప్రకటించారు. మరో వారంలోనే కొత్త కార్యనిర్వాహక ఉత్వర్వులను జారీ చేయనున్నట్టు శుక్రవారం స్వయంగా ట్రంపే మీడియాకు తెలిపటం విశేషం.
అమెరికాలో అడుగుపెట్టే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి తీరాల్సిందేనంటూ ప్రకటించాడు. మరోవైపు న్యాయస్థానాల నిర్ణయాలపై స్పందిస్తూ.. అది చాలా తప్పుడు నిర్ణయమని, దేశ భద్రత, రక్షణకు ప్రమాదకరమైనదని పేర్కొన్నాడు. కొత్త ఆదేశాలు పక్కాగా ఉండబోతున్నాయని సంకేతాలు ఇచ్చాడు. న్యాయం, రాజ్యాంగం ఇవి దేశానికి ముఖ్యం కాదు, భద్రతే అన్నింటికన్నా ప్రధానాంశం. అందుకే ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపాడు. మరోపక్క ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించటమే కాదు, విదేశీ వ్యవహారాలతోపాటు అంతర్గత వ్యాపార సంబంధాలపై పెను ప్రభావం చూపుతాయంటూ 1000 మంది దౌత్యవేత్తలు సంతకాల సేకరణ చేపట్టగా, ఫెడరల్ కోర్టులు ట్రావెల్ బ్యాన్ పై తాత్కాలిక ఊరటనిస్తూ ఆదేశాలు జారీ చేశాయి.
మరోవైపు ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ఉత్తర్వులపై తొమ్మిదో సర్క్యూట్ అప్పీల్ కోర్టు ఇచ్చిన తీర్పును అమెరికా న్యాయశాఖ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆ ఉత్తర్వులు అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉంటే ట్రంప్ ట్రావెల్ బ్యాన్ నిర్ణయాన్ని టెక్సాస్ రాష్ట్రం సమర్థించటం విశేషం.
సంబంధిత కథనాలు...
ట్రంప్ ట్రావెల్ బ్యాన్ పై స్టే
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more