అంతరిక్ష చరిత్రలోనే భారత్ అరుదైన రికార్డు సృష్టించింది. ఒకే సారి 1378 కిలోల బరువైన 104 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లోకి విజయవంతంగా చేర్చింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగిపోగా, వారి కృషిని, శ్రమను శ్లాఘిస్తూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. ప్రపంచంలో అభివృద్ది చెందిన దేశాలు కూడా చేయలేని అరుదైన ప్రయోగాన్ని చేసి మన శాస్త్రవేత్తలు సత్తా చాటారని, ఇక శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనకు ఎవరూ సాటిలేరని కూడా సోషల్ మీడియాలో నెట్ జనులు కామెంట్లు పెడుతున్నారు.
అమెరికా, యూరోప్ దేశాలతో పాటు రష్యాను కూడా ఆశ్యర్యపరుస్తూ.. వెలుగులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ37 ఇప్పటి వరకు ఏ దేశానికి సాధ్యం కాని విధంగా ఒకేసారి 104 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. ఇంతకుముందు 2014లో రష్యా ఒకే సారి 37 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. ప్రయోగానంతరం 28.42 నిమిషాలలో భూమికి 510 కిలోమీటర్ల ఎత్తు నుంచి 524 కిలోమీటర్ల ఎత్తులో ధ్రువసూర్యానువర్తన కక్ష్యలో ఈ ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది.
ఇస్రో శాస్త్రవేత్తల ప్రతిభను.. కృషిని కోనియాడుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దేశ ప్రధాని నరేంద్రమోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు శాస్త్రవేత్తలను అభినందించారు. పీఎస్ఎల్వీ సీ37 విజయవంతంగా కక్షలోకి చేరిన తరువాత ప్రధాని నరేంద్రమోడీ.. శాస్త్రవేత్తలను అభినందించారు. కార్టోశాట్ ఉపగ్రహం సహా మరో 103 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి.. అరుదైన ఫీట్ చేసిన ఇస్త్రో.. మరోమారు ప్రపంచం నలుదిశలా దేశం గర్వించే విధంగా చేసిందని కోనియాడారు.
చరిత్రలో గుర్తుండిపోయే ఈ ప్రయోగం ఇస్రో సాధించిన మరో అద్భుత విజయమని ప్రధానిఅన్నారు. ఈ విజయంలో పాల్గోన్న శాస్త్రవేత్తలందరికీ భారతవని వందనం చేస్తుందన్నారు. ఇటు ఇస్రో శాస్త్రవేత్తలల ఘనతను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు అభినందించారు. ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా ఇస్రో భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిందని కేసీఆర్ పేర్కొన్నారు. రికార్డు సృష్టించి ఇస్రో దేశానికే గర్వకారణంగా నిలిచిందని చెప్పారు. ఇస్రో ఇలాంటి మరిన్ని విజయాలు నమోదు చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఇస్రో సాధించిన ఘనత భారతీయులకు గర్వకారణమని చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఇస్రో టీమ్కి సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఈ అరుదైన ఫీటులో తన సంతోషాన్ని పంచుకున్నారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపుతూనే మనం ఒకరోజు చంద్రుడి మీద అడుగుపెడతామని అశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. తనతోపాటు తన కుమారుడు అభిషేక్ బచ్చన్ కలసి లాంచ్ చేసే శాటిలైట్ తరహాలో ఫోజు పెట్టిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more