మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపి ఎంపీ Sakshi Maharaj contorversy statements on Muslims for population

Sakshi maharaj contorversy statements on muslims for population

sakshi maharaj, sakshi maharaj muslims, sakshi maharaj muslims remark, sakshi maharaj population remark, bjp mp population remark

BJP MP from Unnao, Sakshi Maharaj derogatory remarks against muslims for growth of population in india

మళ్లీ నోరుజారిన బీజేపి ఎంపీ

Posted: 01/07/2017 04:49 PM IST
Sakshi maharaj contorversy statements on muslims for population

‘ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్నల్ని కనాలి’అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌.. ప్రధాని మోదీ చీవాట్లతో కొంతకాలంగా మౌనముద్రను దాల్చారు. ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడి రాజకీయ సందడి నెలకొన్నవేళ మరోసారి తన నోటికి పనిచెప్పారు. ఇవాళ మీరట్ లో జరిగిన ఒక కార్యక్రమానికి వచ్చిన సాక్షి మహారాజ్ మీడియాతో మాట్లాడుతూ ‌.. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు వివరణిస్తూనే ఒక వర్గాన్ని టార్గెట్‌చేస్తూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు.

‘అప్పట్లో నేను మాట్లాడిన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మహిళలేమీ పిల్లల్ని కనే మిషన్లుకాదు! అయితే దేశంలో జనాభా పెరిగిపోతోంది. ఒక వర్గానికి చెందిన వ్యక్తి.. నలుగురిని పెళ్లిచేసుకుని, 40 మంది పిల్లల్ని కని, మూడు సార్లు తలాక్‌ తీసుకుంటాడు. ఇకపై ఇలాంటి పద్ధతిని సహించబోయేది లేదు’ అని సాక్షి మహారాజ్‌ అన్నారు. తన కుటుంబవ్యవహారాన్ని వివరిస్తూ..‘మేం నలుగరు అన్నదమ్ములం. అందరం సన్యాసం స్వీకరించాం. తద్వారా పిల్లల్ని కనకుండా మా వంతు జనాభా ఉత్పత్తిని తగ్గించాం. ఇందుకుగానూ ప్రభుత్వాలు మాకు బహుమతి ప్రదానం చెయ్యాలి’అని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles