పాత నోట్ల మార్పిడికి సమయం ఉన్నప్పటికీ వాటిని తీసుకునేందుకు ఎవరూ ధైర్యం మాత్రం చేయటం లేదు. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు కూడా ఇందులో ఉన్నాయి. ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్, ఆస్పత్రులు, మెడికల్ షాపులు, బస్ లలో వీటిని తీసుకోవాలని ఆర్బీఐ సూచిస్తున్నప్పటికీ, వాటిని ఎవరూ పట్టించుకోవటం లేదు. దీంతో పాత నోట్లను మార్చుకునే కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో కేంద్ర మంత్రి సదానంద గౌడకి స్వయానా తెలిసివచ్చింది.
జాండీస్ తో బాధపడుతూ పది రోజుల క్రితం మంగళూరులోని కస్తూర్బా ఆస్పత్రిలో చేరిన సదానంద గౌడ సోదరుడు భాస్కర గౌడ,(54) నిన్న కన్నుమాశారు. ఇక బిల్లు చెల్లించి మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లాల్సి వుండగా, పాత నోట్లను సదానంద ఇవ్వజూపారు. బిల్లు 40,000 కాగా, 500, 1000 నోట్లను ఇచ్చేందుకు గౌడ మేనల్లుడు ప్రయత్నించాడు.
అయితే ఆసుపత్రి సిబ్బంది ఆ నోట్లను స్వీకరించేందుకు ససేమిరా అనడంతో చేసేదేమీ లేక చెక్కిచ్చి బయటపడ్డారు. అదే సమయంలో పాత నోట్లను తీసుకోమంటూ ఆస్పత్రి నుంచి అధికారికంగా ఓ లేఖ కూడా రాయించుకున్నారు. నిబంధనల ప్రకారం ఆసుపత్రుల్లో పాత కరెన్సీలను తీసుకోవాల్సి వున్నప్పటికీ, ఇలా నిరాకరించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సదానంద తెలిపారు. అంతేకాదు ప్రధాని మోదీ యాప్ కి ఈ విషయమై ఫిర్యాదు కూడా చేస్తానని ట్విట్టర్ లో కాసేపటి క్రితం తెలిపాడు కూడా.
అయితే ఆస్పత్రి యాజమాన్యం మాత్రం ఆ నిబంధన కేవలం ప్రభుత్వ ఆస్పత్రికి మాత్రమే వర్తిస్తుందని, ఆర్బీఐ, కేంద్రం కూడా ఇదే విషయాన్ని ప్రకటించాయని నొక్కి చెబుతోంది. .
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more